మామూలుగా సినీ సెలబ్రిటీలు ఏదైనా ఈవెంట్ కి గాని లేదా పని నిమిత్తమై బాహ్య ప్రపంచానికి వస్తే కొందరు ఫోటోలు తీయడం మరియు వారి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించడం వంటివి చేస్తుంటారు. ఈ క్రమంలో కొందరు వారి వ్యక్తిగత విషయాలను అడుగుతూ సెలబ్రిటీలను ఇబ్బంది పెడుతుంటారు.
అయితే తాజాగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వం వహించిన క్రాక్ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న జయమ్మ పాత్రలో నటించి తెలుగు సినీ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన కోలీవుడ్ బ్యూటీ వరలక్ష్మి శరత్ కుమార్ గురించి కొత్తగా సినిమా ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
కాగా తాజాగా వరలక్ష్మి శరత్ కుమార్ తన దగ్గరి బంధువుల వేడుకకి అతిధిగా వెళ్ళింది.
దీంతో ఓ రిపోర్టర్ వరలక్ష్మి శరత్ కుమార్ నిప్రశ్నలు అడిగే ప్రయత్నం చేశాడు.ఈ క్రమంలో మీరు ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారని, అలాగే మీరు చేసుకోబోయే వరుడు గురించి తెలియజేయాలని కోరాడు.
దీంతో వరలక్ష్మి శరత్ కుమార్ రిపోర్టర్ పై ఒక్కసారిగా ఫైర్ అయ్యింది. అంతేగాక సెలెబ్రెటీలకు కూడా తమ వ్యక్తిగత విషయాలు ఉంటాయని వాటి గురించి పబ్లిక్ లో చర్చించడం మంచిది కాదని వార్నింగ్ ఇచ్చింది.
అంతేగాక మరే ఇతర సెలబ్రిటీలను కూడా వారి వ్యక్తిగత విషయాల గురించి అడగొద్దని సూచించింది.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇటీవలే వరలక్ష్మి శరత్ కుమార్ తెలుగులో అల్లరి నరేష్ హీరోగా నటించిన నాంది చిత్రంలో లాయర్ పాత్రలో నటించింది.
ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకొంది. దీంతో ప్రస్తుతం వరలక్ష్మి శరత్ కుమార్ కి టాలీవుడ్ లో సినిమా అవకాశాలు కట్టినట్లు సమాచారం. అంతేగాక ఇటీవలే వరలక్ష్మి శరత్ కుమార్ అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న ఓ చిత్రంలో ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.