ఈమద్య కాలంలో సోషల్ మీడియాలతో పాటు అన్ని మీడియాల్లో కూడా కనిపిస్తున్న మూవీ జాతి రత్నాలు.ఎక్కడ చూసినా కూడా నవీన్ పొలిశెట్టి మరియు ఇతర యూనిట్ సభ్యులు కనిపిస్తున్నారు.
అన్ని ఛానెల్స్ తో పాటు షోల్లో కూడా వీరే కనిపిస్తున్నారు.యూట్యూబ్ లో వీరి సందడి అంతా ఇంతా లేదు.
ముంబయి వెళ్లి ప్రభాస్ తో ట్రైలర్ ను విడుదల చేయించిన వీడియో ను కూడా యూట్యూబ్ లో జనాలు తెగ చూస్తున్నారు.ఇక ట్రైలర్ కు మంచి స్పందన రావడంతో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.
ఈ సినిమా ను మహానటి నిర్మాత నాగ్ అశ్విన్ నిర్మిస్తున్నాడు.కనుక అంచనాలు భారీగా ఉన్నాయి.
వాటికి తోడు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు.ఈ కారణాల వల్ల జాతి రత్నాలు సినిమా ఓ రేంజ్ లో మారు మ్రోగి పోతుంది.
నవీన్ పొలిశెట్టి ఎనర్జిటిక్ హీరోగా పేరు దక్కించుకున్నాడు.
ట్యాలెంట్ తో అందరిని మెస్మరైజ్ చేయగల సత్తా ఉన్న నవీన్ పొలిశెట్టి ఈ సినిమా లో ఎంటర్ టైన్ మెంట్ తో కుమ్మేసి ఉంటాడు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మరియు ప్రేక్షకులు ట్రైలర్ చూసిన తర్వాత అంటున్నారు.
జాతి రత్నాలు సినిమా ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.విడుదల తేదీ దగ్గర పడుతున్నా కొద్ది ప్రచార హోరు పెంచుతున్న నేపథ్యంలో సినిమా ప్రచారంతోనే మ్యాజిక్ చేస్తున్నారా లేదంటే సినిమా లో మ్యాటర్ ఉంటుందా అనే అనుమానాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు.
ట్యాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమా ను నిర్మిస్తున్నాడు కనుక ఖచ్చితంగా మంచి సబ్జెక్ ను ఎంపిక చేసుకుని ఉంటాడు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.