దేశంలో కరోనా వ్యాక్సిన్ పక్రియలో వేగం పెరిగినట్లు సమాచారం.ఇదివరకే రాజకీయ, సినీ రంగాలకు చెందిన ప్రముఖులంతా కోవిడ్ టీకా ఇప్పించుకున్నారు.
ఇంకా ఈ టీకా కోసం మరి కొంత మంది సిద్దం అవుతున్నారు.ఇకపోతే తాజాగా బీజేపీ ఎంపీ, బాలీవుడ్ నటి, హేమమాలిని కొవిడ్ టీకా తొలి డోసు తీసుకున్నారు.
ముంబైలోని కూపర్ ఆస్పత్రి వైద్యులు హేమమాలినికి టీకా ఇచ్చారు.
ఈ మేరకు హేమమాలిని నేను టీకా తీసుకున్నాను, మీరు కూడా త్వరగా ఈ వ్యాక్సిన్ తీసుకోండి అని ట్వీట్ చేశారు.
ఇకపోతే దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ జనవరి 16 నుంచి కొనసాగుతున్న విషయం తెలిసిందే.ఇందులో భాగంగా ముందుగా పారిశుద్ధ్య కార్మికులకు, వైద్య సిబ్బందికి టీకాలు వేయగా, ఆ తర్వాత పోలీసులకు వ్యాక్సిన్లు ఇచ్చారు.
ఇదిలా ఉండగా మార్చి 1 నుంచి 45 సంవత్సరాలతో పాటుగా, 60 సంవత్సరాలు పైబడిన వారికి అందులో దీర్ఘకాలిక రోగాలు ఉన్న వారికి కూడా ఈ కరోనా వ్యాక్సిన్ ఇస్తున్నారు.