తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్రంలో రోజురోజుకు బలహీనపడుతోంది.తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినా దానిని రాజకీయంగా మలుచుకోవడంలో విఫలమయింది.
దాని తరువాత జరిగిన ఎన్నికల్లో అనుకున్నంతగా సత్తా చాటడంలో విఫలమవుతూ వస్తోంది.అయితే కాంగ్రెస్ లో కుమ్ములాటలతో కలిసికట్టుగా విఫలమవుతుండటంతో ప్రజల్లో కాంగ్రెస్ బలహీనపడింది.
అయితే ఇటీవల జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయంతో చతికిల పడ్డ సంగతి తెలిసిందే.అయితే దాని తదనంతరం పీసీసీ చీఫ్ పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
అయితే కాంగ్రెస్ అధిష్టానం కొత్త పీసీసీ చీఫ్ నియామకానికి ఓ దూతను పంపి కసరత్తు ప్రారంభించి చివరిగా ఓ ఇద్దరి పేర్లను కాంగ్రెస్ అధిష్టానం పరిశీలించింది.అయితే మరల కొంత మంది కాంగ్రెస్ నేతలు మరల అభ్యంతరం వ్యక్తం చేయడంతో మరల తెలంగాణ పీసీసీ చీఫ్ ఎంపికను కాంగ్రెస్ అధిష్టానం వాయిదా వేసింది.
అయితే రోజు రోజుకు తెలంగాణలో కాంగ్రెస్ బలహీనపడుతున్న పరిస్థితులలో బీజేపీ, టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుండడంతో కాంగ్రెస్ అధిష్టానం దిద్దుబాటు చర్యలు ఏవీ తీసుకోవడం లేదు.అయితే ఇంతటి కఠిన పరిస్థితులలో కూడా తెలంగాణ కాంగ్రెస్ ను అధిష్టానం పట్టించుకోకపోవడంతో ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ ను అధిష్టానం ఖాతరు చేయకపోవడంతో ఇప్పుడు ఈ విషయం సర్వత్రా చర్చనీయాంశమైంది.