ఎవరైనా సరే స్త్రీ గర్భవతి అని తెలిసిన వెంటనే అందరూ హాస్పిటల్ కు వెళ్లి మొదటి నుంచి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం.మరి కొంతమంది హాస్పిటల్ లో లింగ నిర్ధారణ కోసం స్కానింగ్ చేయించడం లాంటివి చేస్తూ ఉండడం మనం గమనిస్తూనే ఉంటాం.
ఇది ఇలా ఉండగా మన పూర్వీకుల కాలంలో మాత్రం ఆధునిక పరిజ్ఞానం లేని సమయంలో మన బామ్మలు తల్లి గర్భంలో ఉన్న శిశువు లింగాన్ని మహిళల గర్భంని చూసి మాత్రమే నిర్ధారణ చేసే వారట.ఇలా వారు చెప్పడానికి కూడా ఒక సంకేతం ఏమిటి అంటే.
గర్భంలో ఆడ శిశువు ఉంటే మాత్రం గర్భం పెద్దదిగా ఉంటుందట.ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చాలా వరకు అదే నమ్ముతారు.
ప్రస్తుత రోజుల్లో కనీసం కొన్ని నెలలు నిండకుండానే గర్భంలో ఉన్న శిశువు లింగ నిర్ధారణ చేయడానికి స్కానింగ్ పద్ధతిలో తెలుసుకుంటూ ఉన్నారు.ప్రస్తుతం ఉన్న సమాజ తీరును బట్టి లింగనిర్ధారణ ప్రయోజనాత్మకంగా, అటు ఇబ్బందికరంగా మారుతుండడంతో గర్భ నిర్ధారణపై నిషేధం విధించారు.
ఇందుకు గల ముఖ్య కారణం కూడా ఉంది.అది ఏమిటంటే.గర్భంలో ఉన్న శిశువు ఆడపిల్ల అని తెలిస్తే వెంటనే గర్భం తియించుకుంటున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఇలా ఉండగా ఇంతకీ మన పూర్వీకులు గర్భం పెద్దదిగా ఉండి అంటే ఆడశిశువు అని అనడానికి గల కారణం కూడా ఉంది అది ఏమిటి అంటే.ఆడ శిశువు ఉన్న గర్భం లో శిశువు చుట్టూ ఉండే ద్రవపదార్థం ఎక్కువ మోతాదులో ఉంటుందని వారి నమ్మకం.అంటే మగ శిశువు ఉన్న గర్భంలో చుట్టూ ఉన్న ద్రవపదార్థం కంటే ఆడ శిశువు చుట్టూ ఉండే ద్రవపదార్థం ఎక్కువ మోతాదులో ఉంటుందట.
ఒకవేళ మగ శిశువు ఉంటే గర్భం చుట్టూ ఉండే ద్రవపదార్థం చాలా చిన్నగా ఉండడంతో పాటు గర్భం కాస్త చిన్నగా కనపడుతుంది.కేవలం ఈ లాజిక్ ఆధారంగానే మన పూర్వీకులు గర్భంలో ఉండే శిశువును లింగ నిర్ధారణ చేసేవారు.