నిన్న మధ్యాహ్నం విజయనగరం జిల్లా కొండపల్లి మండలం దేవుని పల్లి పంచాయతీ పరిధిలోని కొండ వాని పాలెం లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.అగ్నిప్రమాదంలో నలభై పూరిల్లు అక్కడికక్కడ దహనం అయ్యాయి.
ఈ క్రమంలో ఇంటిలో ఉన్న విలువైన పత్రాలు మరియు డబ్బులు.బట్టలు కాలిపోవడంతో భారీ ఎత్తున ఆస్తి నష్టం సంభవించడం జరిగింది.
మొత్తం కాలిపోవడంతో ఒంటిపై ఉన్న కట్టుబట్టలతో నే ఉండవలసిన పరిస్థితి బాధితులకు నెలకొంది.
ఇదిలా ఉంటే అగ్నికి పూరిళ్లు ఆహుతి అవుతున్న తరుణంలో.
వెంటనే అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేసినా గాని.అప్పటికే చాలా ఇళ్లు కాలిపోవడంతో.
అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొని కేవలం ప్రాణనష్టం జరగకుండా చూస్తారు.ఈ విషయాన్ని ఎమ్మార్వో సీతారామరాజు తెలిపారు.
పూరిళ్లు మొత్తం గిరిజనుల వే కావటంతో పాటు వాళ్ళు వ్యవసాయ కూలీలుగా ఏ రోజుకి ఆ రోజు బతుకు అనే పరిస్థితి ఉండటంతో .కష్టం మొత్తం అగ్నికి ఆహుతి కావడంతో బాధితులు కన్నీరుమున్నీరవుతున్నరు.దాదాపు యాభై ఇళ్లకు 40 ఇళ్లు కాలిపోవడంతో.40 లక్షల రూపాయల ఆస్తినష్టం జరిగినట్లు అధికారులు లెక్కలు వేశారు.
.