సమాజంలో పరిస్థితిలో రోజు రోజుకి దిగజారి పోతున్నాయి.ఇంటి నుండి బయటకు ఆడపిల్ల వెళ్ళింది అంటే తిరిగి వచ్చేంతవరకు ఏం జరుగుతుందో అనే టెన్షన్ ప్రతి ఇంటిలో ఉంది.
చాలా వరకు దేశంలో ఆడవాళ్లపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి.ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా .మగాళ్ల రూపంలో ఉన్న మృగాల మెదడులో మార్పు రావటం లేదు.పరిస్థితి ఇలా ఉండగా ఝార్ఖండ్లో ఒక యువతిపై ఏకంగా 60 మంది నాన్ స్టాప్ గా అత్యాచారానికి పాల్పడిన ఘటన బయటపడింది.
సరాయ్కేలా-ఖర్సావా జిల్లాలోని కందర్బేరా సమీపంలో మూతపడిన గ్యారేజీలో తనను నెల రోజులపాటు బంధించారని, 60 మంది అత్యాచారానికి పాల్పడ్డారని బాధిత యువతి .వారి నుండి తప్పించుకుని నేరుగా పోలీస్ స్టేషన్ పేర్కొంది.ఈ మేరకు పోలీసులు ఫిర్యాదు నమోదు చేసుకున్నారు.బహిర్భూమికి వెళుతున్నట్లు చెప్పి వారి నుండి తప్పించుకోవటం జరిగిందని, బాధిత యువతి తనకు జరిగిన అన్యాయాన్ని పోలీసులకు వివరించింది.
భయంకరంగా అనారోగ్యానికి గురికావటంతో ఏమీ చెప్పలేని పరిస్థితి ఉండటంతో .పోలీసులు యువతిని హాస్పిటల్లో జాయిన్ చేసి ఆమె కోలుకున్న తర్వాత .కేసు గురుంచి పూర్తి వివరాలు తెలియజేస్తామని పేర్కొన్నారు.
.