తెలుగు చలన చిత్ర పరిశ్రమలో 150 కి పైగా చిత్రాలలో నటించి మెగా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరో చిరంజీవి గురించి దాదాపుగా సౌత్ ఇండియాలో తెలియని వారుండరు.అయితే చిరంజీవి కేవలం హీరోగా మాత్రమే కాకుండా ఆపదలో ఉన్నవారికి రక్త దానం చేస్తే ప్రాణ దానం చేసినట్లని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కూడా స్థాపించి రోజూ ఎంతో మందికి సహాయ పడుతున్నాడు.
అంతేకాక ప్రజలకు సేవ చేయాలనే మంచి ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసి పలు ప్రజా సమస్యలపై పోరాటం చేశాడు.
అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అయితే గత నెల 20వ తారీఖున మెగాస్టార్ చిరంజీవి మరియు సురేఖ కొణిదల పెళ్లి రోజు కావడంతో చిరంజీవి కూతురు సుస్మిత తన తల్లిదండ్రులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేసింది.అంతేగాక పెళ్లయిన కొత్తలో మెగాస్టార్ చిరంజీవి మరియు సురేఖ కొణిదెల దిగిన ఫోటోని కూడా షేర్ చేసింది.
దీంతో అభిమానులు మరియు పలువురు సినీ సెలబ్రిటీలు మెగాస్టార్ చిరంజీవి కి పెద్ద ఎత్తున కామెంట్ల రూపంలో శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం సుష్మిత పలు టాలీవుడ్ చిత్రాలకి కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేస్తోంది.
ఇక మెగాస్టార్ చిరంజీవి విషయానికి వస్తే ప్రస్తుతం తెలుగులో ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న “ఆచార్య” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.ఈ చిత్రంలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.
అలాగే ఈ చిత్రంలో టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కూడా గెస్ట్ రోల్ పాత్రలో కనిపించనున్నాడు.దీంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.