అప్పుడప్పుడు కొన్ని అద్బుతాలు మన కళ్ళముందు కనిపించి మనల్నే మాయ చేస్తాయి.ప్రకృతిలో ఉన్న గొప్పతనం అదే.
ప్రకృతి అరుదుగా కొన్ని దృశ్యాలు కనిపిస్తాయి.వాటిని చూసినపుడు నిజమేనా అనిపిస్తుంది.
అయితే కొన్ని దృశ్యాల విషయంలో టెక్నాలజీ మాయాజాలం కూడా కనిపిస్తుంది.ఫోటోగ్రాఫర్స్ తమ క్రియేటివ్ టాలెంట్ గా డిఫరెంట్ యాంగిల్ లో ఫోటోలు తీసి బయట కనిపించే దృశ్యాన్ని పూర్తిగా మార్చేసి సరికొత్తగా ఆవిష్కరిస్తారు.
ఏది ఏమైనా ఇలాంటి ఫోటో మాయాజాలం కనిపించినపుడు మాత్రం ప్రతి ఒక్కరి కళ్ళు వాటి మీదకి ఆటోమేటిక్ గా వెళ్ళిపోతాయి.పర్వతాల దగ్గరకి వెళ్ళినపుడు పైన ఆకాశం పర్వతం అంచున తాకినట్లు కనిపిస్తుంది.
అలాగే మేఘాలు, సముద్రం కలిసిపోయినట్లు కనిపిస్తాయి.శీతాకాలంలో ఉదయం లేస్తే మంచు దుప్పటి పరుచుకున్నట్లు వాతావరణం కనిపిస్తుంది.
అలాంటి దృశ్యం ఓ చోట దర్శనం ఇచ్చింది.సముద్రంలో ఉండాల్సిన నౌక ఏకంగా కొంత ఎత్తున గాల్లో ఎగురుతున్నట్లు కనిపించింది.
దానికి సంబందించిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
స్కాట్లాండ్ లో అబెర్డీన్షైర్ బన్ఫ్ టౌన్ నుంచి కోలిన్ మెక్కల్లమ్ అనే వ్యక్తి వెళ్తున్న సమయంలో హోరిజాన్లో ఈ రెడ్ వెజిల్ కనిపించింది.
ఫేస్బుక్లో అతడు పోస్ట్ చేసిన ఫొటోలో నీటిపైన కొంత ఎత్తులో షిప్ తేలుతున్నట్లు కనిపించింది.తాను చూసిన దృశ్యాన్ని నమ్మలేక అతను ఆశ్చర్యంతో ఫోటో తీసి తీసి ఫేస్బుక్ లో పోస్ట్ చేశాడు.
ఆ ఫోటో కాస్తా వైరల్ అయ్యింది.ఆ షిప్ అలా గాల్లో తేలుతున్నట్లు ఉండటానికి కారణం సముద్రమూ, ఆకాశము ఒకే రంగులో ఉండటమే.
ఈ రోజు బన్ఫ్ దగ్గర నిజజీవితంలో ఆప్టికల్ ఇల్యూజన్ని చూశాను అని 23 ఏళ్ల మెక్కల్లమ్ ఫేస్బుక్లో షేర్ చేసిన ఫొటోతో పాటు రాశాడు.ఇది ఇప్పడు వైరల్గా మారింది
.