దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం మొదటి దశలో కరోనా టైములో ప్రాణాలు పణంగా పెట్టి పనిచేసిన ఫ్రంట్ లైన్ వర్కర్లకు వేసిన సంగతి తెలిసిందే.రెండో దశ మార్చి ఫస్ట్ నుండి ప్రారంభం కాగా నలభై ఐదు సంవత్సరాలకు పైబడి ఉన్న వాళ్లు అదేవిధంగా 60 సంవత్సరాలకు పైబడిన వాళ్లకి కరోనా వ్యాక్సిన్ అందించడానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇప్పటికే చాలా మంది ప్రముఖులు కరోనా వ్యాక్సిన్ వేయించుకోవటం జరిగింది.
ఈ క్రమంలో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తాజాగా తన తల్లిదండ్రులతో కలిసి ఢిల్లీలోని ఎల్ఎన్జెపి ఆసుపత్రిలో వ్యాక్సిన్ మొదటి మోతాదును స్వీకరించారు.
ప్రజలందరూ ముందుకు వచ్చి టీకా తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు.
అర్హులైన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి అని పిలుపునిచ్చారు.మరోపక్క జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ లో ఆ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కూడా ఈ రోజు కరోనా టీకా మొదటి మోతాదు చేయించుకోవడం జరిగింది.