ఏపీ తెలుగుదేశం పార్టీ లో ఏలూరు మాజీ ఎంపీ, మాగంటి బాబు కుమారుడు, రాంజీ ఆత్మహత్యకు ప్రయత్నించడం సంచలనంగా మారింది.రాత్రి రాంజీ నిద్ర మాత్రలు మింగి సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించగా, విషయాన్ని పసిగట్టిన రాంజీ కుటుంబీకులు, అతన్ని హుటాహుటిన విజయవాడ లోని ఆంధ్రా ఆసుపత్రికి తరలించారట.
అయితే అతనికి ఐసీయూలో వెంటిలేటర్ పై చికిత్సను అందిస్తున్నామని వైద్య వర్గాలు వెల్లడించాయి.కాగా ప్రస్తుతం రాంజీ చావు బతుకుల మధ్య పోరాడుతున్నాడని తెలుస్తోంది.
కొన్ని గంటలు గడిస్తే గానీ ఇతని ఆరోగ్య పరిస్దితికి సంబంధించిన ఏ విషయం అయినా చెప్పగలమని డాక్టర్లు అంటున్నారట.
ఇకపోతే రాంజీ స్లీపింగ్ పిల్స్ మింగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
కానీ కొందరు మాత్రం ఆయనకు గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలించారని చెబుతున్నారు.ఇందులో దాగి ఉన్న నిజం ఏంటో ఈ రోజు గడిస్తే గానీ తెలియదు.