ప్రముఖ సింగర్ శ్రేయా ఘోషల్ తన గాత్రంతో లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.ఈమె హిందీతో పాటు దక్షిణాది పాటలను కూడా పాడారు.
హిందీ చిత్రం దేవదాస్ తో తన సినీ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన శ్రేయా ఘోషల్ మొదటి సినిమాతో ఉత్తమ గాయనిగా అవార్డు అందుకున్నారు.అక్కడ నుండి ఇంకా ఆమె వెను దిరిగి చూడలేదు.
ఇప్పటి వరకు ఈమె నాలుగు జాతీయ అవార్డులు అందుకున్నారు.
ఈ మధ్య రిలీజైన ఉప్పెన సినిమాలో జల జల జలపాతం అంటూ సాగే పాటను ఆలపించి అభిమానులను అలరించారు.
అంతేకాదు నాని హీరోగా తెరకెక్కుతున్న టాక్ జగదీష్ లో కూడా ఇంకోసారి ఇంకోసారి అంటూ సాగే పాటను కూడా ఆలపించారు.
అయితే శ్రేయా ఘోషల్ అభిమానులకు ఒక గుడ్ న్యూస్ చెప్పింది.త్వరలో తమ ఇంట్లోకి మూడో వ్యక్తి రాబోతున్నాడని అభిమానులకు చెప్పింది.వెస్ట్ బెంగాల్ కు చెందిన శ్రేయా ఘోషల్ తన స్నేహితుడైన శైలాదిత్యను 2015 లో పెళ్లి చేసుకుంది.
ఇతడు ఒక బిజినెస్ మాన్.ఆరు సంవత్సరాల వీరి అన్యోన్య దాంపత్యానికి గుర్తు గా ఒక బిడ్డ రాబోతుంది.
ఈ విషయమై శ్రేయా ఘోషల్ ట్విట్టర్ లో ట్వీట్ చేసింది.ఆ ట్వీట్ లో బేబీ శ్రీయాదిత్య త్వరలో రాబోతుంది ఈ విషయాన్ని మీతో పంచుకోవడం శైల్ ఆదిత్యకు, నాకు చాలా సంతోషంగా ఉంది ఈ నూతన అధ్యయనానికి మీ ఆశీస్సులు కావాలంటూ ట్విట్టర్ లో ట్వీట్ చేసింది.
ఈ విషయం తెలుసుకున్న శ్రేయా ఘోషల్ అభిమానులు, సినీ ప్రముఖులు కూడా ఆమెకు అభినందనలు తెలుపుతున్నారు.ఈ సందర్భం గా కడుపుతో ఉన్న ఒక ఫోటోను కూడా షేర్ చేసింది.
ఇప్పుడు ఈ ఫోటో కాస్తా వైరల్ గా మారింది.
.