ఇటీవల పంచాయతీ ఎన్నికలలో హిందూపురం నియోజకవర్గంలో అత్యధిక స్థానాలు వైసిపి గెలిచిన సంగతి తెలిసిందే.దీంతో మార్చి పదవ తారీకు జరగబోయే మున్సిపల్ ఎన్నికలలో సత్తా చాటాలని నియోజకవర్గ ఎమ్మెల్యే బాలయ్య బాబు చాలా సీరియస్ గా .
నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు.ఇప్పటివరకు నియోజకవర్గంలో 578 వార్డులు ఏకగ్రీవం కాగా వాటిలో 570 వైసిపి కైవసం చేసుకుంది.
దీంతో అలర్ట్ అయిన బాలయ్యబాబు.టిడిపి పార్టీ తరఫున నియోజకవర్గంలో ప్రతి వార్డు లో ప్రచారం చేయడానికి రెడీ అవుతున్నారు.
ఉదయం ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆ తర్వాత ఎన్నికల ప్రచారంలో పాల్గొనటానికి బాలయ్య బాబు రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్నట్లు సమాచారం.ఎక్కడా కూడా ఏకగ్రీవం కాకుండా టిడిపి అభ్యర్థులను బలపరుస్తూ మరోపక్క కేడర్ ని ముందుకు నడిపించడానికి బాలయ్య మున్సిపల్ ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకున్నట్లు టిడిపి పార్టీ నుండి వినబడుతున్న టాక్.
ఎన్నికలు జరిగేంత వరకు నియోజకవర్గంలో క్యాడర్ కి అందుబాటులో ఉండే విధంగా.బాలయ్య బాబు షెడ్యూల్ ప్రిపేర్ చేసుకున్నట్లు సమాచారం.