మరికొన్ని రోజుల్లో తమిళనాడు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.ఎన్నికల నేపథ్యంలో తమిళనాడు రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ మేనిఫెస్టోలను ప్రకటించడంతో పాటు అధికారంలోకి వస్తే అమలు చేయబోయే పథకాల గురించి ప్రకటనలు చేస్తున్నాయి.
ప్రముఖ నటి రాధికా శరత్ కుమార్ కూడా ఈ ఏడాది తమిళనాడు రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల్లో పోటీ చేయనున్నారని తెలుస్తోంది.
ఎస్.
ఎమ్.కే పార్టీ నుంచి రాధిక పోటీ చేయనున్నారు.ఇన్నిరోజులు అన్నాడీఎంకె కూటమికి మద్దతు ఇచ్చిన రాధిక ఆ పార్టీలో అనుకున్న స్థాయిలో ప్రాధాన్యత దక్కలేదని తెలిపారు.ఎస్ఎమ్కే పార్టీకి శరత్ కుమార్ అధినేత కాగా శరత్ కుమార్ ఆదేశాల ప్రకారం ఎన్నికల్లో పోటీ విషయంలో ముందడుగులు వేస్తామని రాధిక అన్నారు.
ఉసిలంపట్టి లేదా వేలాచ్చేరి నుంచి రాధిక పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.గత కొన్నేళ్ల నుంచి రాధిక పరిమితంగానే సినిమాల్లో నటిస్తున్నారు.
రాజకీయాల్లో బిజీ కావాలనే ఉద్దేశంతో రాధిక పిన్ని 2 సీరియల్ నుంచి కూడా తప్పుకున్నారని తెలుస్తోంది.ఎన్నికల్లో రాధిక పోటీ చేస్తే విజయం సాధిస్తారో లేదో చూడాల్సి ఉంది.శరత్ కుమార్ రాష్ట్రంలో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు కోసం స్టార్ హీరో కమల్ హాసన్ తో చర్చలు జరుపుతున్నారని సమాచారం.అయితే సర్వేలు మాత్రం తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే పార్టీ అధికారంలోకి వస్తుందని వెల్లడిస్తున్నాయి.
తమిళనాడులో డీఎంకే అధికారంలోకి వస్తే స్టాలిన్ సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయి.రాష్ట్రంలోని కొళత్తూరు డివిజన్ నుంచి స్టాలిన్ పోటీ చేయనున్నారని సమాచారం.
తమిళనాడు రాష్ట్రంలో ఏ పార్టీ గెలుస్తుందో అని తెలుగు రాష్ట్రాల ప్రజలు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తుండటం గమనార్హం.రాధికతో పాటు తమిళనాడుకు చెందిన పలువురు సినీ ప్రముఖులు ఎన్నికల్లో పోటీ చేయనున్నారు.