కింగ్ విరాట్ కోహ్లీ ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.క్రికెట్ ప్రపంచంలో విరాట్ కోహ్లీ గురించి తెలియని వారు ఎవరూ ఉండరు.
ఏ ఫార్మాట్ లో అయినా కానీ స్టేడియం లోకి అడుగు పెడితే చాలు పరుగులు తీయడంలో ఈయనకు సాటి ఎవరూ లేరు.క్రికెట్ ప్రపంచంలోని అన్ని ఫార్మాట్లలో అనేక రికార్డులను సొంతం చేసుకొని ముందుకు కొనసాగుతున్నాడు.
విరాట్ కి సాటి ఎవరు లేరు అని నిరూపించుకుంటున్నాడు.తాజాగా విరాట్ కోహ్లీ ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య 100 మిలియన్స్ కి చేరుకుంది.
దీంతో మన భారతదేశం ఇంస్టాగ్రామ్ లో అరుదైన ఘనత సాధించిన తొలి సెలబ్రిటీగా విరాట్ కోహ్లీ అవ్వడం చెప్పుకోదగ్గ విషయం.
గతంలో ప్రముఖ సినీ నటులు రణవీర్ సింగ్, ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనే సోషల్ మీడియా లో అత్యధికంగా ఫాలోవర్స్ ను కలిగి ఉన్న వారిలో ఉండగా తాజాగా భారతదేశ ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ సోషల్ మీడియాలో ఈ ఘనతను సాధించాడు.
ఇదిలా ఉండగా తాజాగా వీరందరినీ వెనక్కి నెట్టేసి విరాట్ కోహ్లీ నెంబర్ వన్ స్థానానికి ఎటువంటి అడ్డంకి లేకుండా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.
కోహ్లీ అనంతరం ప్రియాంక చోప్రా 60 మిలియన్ ఫాలోవర్స్, దీపికా పదుకొనే 53.3 మిలియన్ ఫాలోవర్స్, భారత ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ 51.2 మిలియన్ ఫాలోవర్లు సొంతం చేసుకున్నారు.ఇక అత్యంత ఫాలోవర్లు ఉన్న తొలి క్రికెటర్ విరాట్ కోహ్లీ నే అవ్వడం విశేషం.ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇంస్టాగ్రామ్ లో ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్న క్రీడా సెలబ్రెటీ కూడా విరాట్ అవ్వడం అభిమానుల్లో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇలా ఉండగా గురువారం నుంచి ఇంగ్లండ్ వేదికగా నాలుగో టెస్ట్ ప్రారంభానికి సిద్ధమవుతోంది.టీమిండియా చివరి టెస్ట్ కోసం చాలా సీరియస్ గా ప్రాక్టీస్ చేస్తున్న సంగతి అందరికీ విదితమే.