ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా తెరకెక్కిన కేజీఎఫ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.కన్నడ ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా అదే స్థాయిలో కలెక్షన్స్ ని పాన్ ఇండియా రేంజ్ లో సొంతం చేసుకుంది.
ఏకంగా 250 కోట్లకి పైగా కలెక్షన్స్ ని ఈ సినిమా అన్ని బాషలలో రాబట్టింది.ఇదిలా ఉంటే ఈ సినిమాకి సీక్వెల్ గా ప్రశాంత్ నీల్ మరింత భారీ బడ్జెట్ తో కేజీఎఫ్ చాప్టర్ 2ని తెరకెక్కించారు.
ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకొని రిలీజ్ కి రెడీ అవుతుంది.హోంబలే ఫిలిమ్స్ ఈ సినిమాని నిర్మించిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ విషయంలో నిర్మాతలు చెబుతున్న రెట్లు బయ్యర్లకి దడ పుట్టిస్తున్నాయి.ఇప్పటికే హిందీ, తమిళ్ రైట్స్ అమ్ముడుపోయాయి.
ఇక తెలంగాణ రిలీజ్ రైట్స్ ని దిల్ రాజు సొంతం చేసుకున్నాడు.ఏపీకి సంబంధించి కూడా అమ్ముడుపోయినట్లు తెలుస్తుంది.
తెలుగుబాషలోనే కేజీఎఫ్ చాప్టర్ 2కి ఏకంగా 90 కోట్లు రాబట్టినట్లు తెలుస్తుంది.
అయితే కేజీఎఫ్ చాప్టర్ 2ని అదే నిర్మాతలు తెరకెక్కిస్తున్న సలార్ మూవీతో లింక్ పెట్టి వారు బిజినెస్ చేసుకున్నట్లు తెలుస్తుంది.ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోనే హోంబలే ఫిలిమ్స్ నిర్మాతలు సలార్ ని ఏకంగా 150 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.ఇక కేజీఎఫ్ చాప్టర్ ని అమ్మిన వాళ్ళకి రిలీజ్ తర్వాత లాస్ వస్తే దానిని సలార్ మూవీ రైట్స్ కూడా వారికే ఇచ్చి సరిచేస్తామని ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తుంది.
ఈ నేపధ్యంలో కేజీఎఫ్ సీక్వెల్ కి అనుకున్న స్థాయిలో కలెక్షన్ రాకపోయిన తెలుగులో ప్రభాస్ కి ఎలాగూ మంచి మార్కెట్ ఉంది కాబట్టి సేఫ్ జోన్ లో ఉండొచ్చని వారు చెప్పిన మొత్తానికి చాప్టర్ 2 రైట్స్ ని బయ్యర్లు సొంతం చేసుకున్నారని తెలుస్తుంది.