60 సంవత్సరాలు దాటిన ప్రతి వ్యక్తి కి, 45 ఏళ్ళు దాటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికి టీకా ఇస్తున్నట్లు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం మార్చి ఫస్ట్ నుండి పంపిణీ కార్యక్రమం చేస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే ప్రధాని మోడీ తో పాటు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కొంతమంది ముఖ్యమంత్రులు వ్యాక్సింగ్ చేయించుకోవడం జరిగింది.
ఇలాంటి తరుణంలో తాజాగా కేంద్ర హోం సహాయ శాఖ మంత్రి కిషన్ రెడ్డి గాంధీ హాస్పిటల్ లో కోవిషిల్డ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు.ప్రభుత్వ హాస్పిటల్ లో ఉచితంగా గా ప్రైవేట్ హాస్పిటల్ లో వ్యాక్సిన్ కి 250 రూపాయల ధర నిర్ణయించిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో అర్హులైన ప్రతి ఒక్కరూ తెలంగాణ రాష్ట్రంలో 91 కేంద్రాల్లో వ్యాక్సినేషన్ కేంద్రాలు ఉన్నాయని ఇందులో ప్రభుత్వ ఆధీనంలో 45 నడుస్తున్నాయని ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేయించుకోవాలి అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.