ఆకాష్ పూరి హీరోగా మెహబూబా సినిమా తో పరిచయం అయ్యి నిరాశ పర్చాడు.ఎంతో మంది యంగ్ హీరోలకు సూపర్ హిట్ లను అందించి హీరోలుగా నిలబెట్టిన దర్శకుడు పూరి జగన్నాద్ తన తనయుడికి మాత్రం హీరోగా సక్సెస్ ను ఇవ్వలేక పోతున్నాడు.
ఇప్పుడు హీరోగా తన కొడుకుతో సినిమాను నిర్మిస్తున్నాడు.ఆ సినిమా పేరే రొమాంటిక్.
అనీల్ పాదూరి దర్శకత్వంలో ఛార్మి తో కలిసి ఈ సినిమా ను పూరి ఈ సినిమా ను నిర్మించిన విషయం తెల్సిందే.ప్రస్తుతం సినిమా విడుదలకు సిద్దం అవుతుంది.
సినిమా ను గత ఏడాది విడుదల చేయాలని భావించారు.కాని కరోనా వల్ల సినిమా ను వాయిదా వేశారు.
ఆ మద్య ప్రముఖ ఓటీటీ కి ఈ సినిమా ను అమ్మేశారు అంటూ వార్తలు వచ్చాయి.కాని ఇప్పటి వరకు ఏ ఓటీటీ తో కూడా చర్చలు జరగలేదు అంటూ క్లారిటీ ఇచ్చేశారు.
తాజాగా ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ డేట్ ఇచ్చేశారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీ పై యూనిట్ సభ్యులు క్లారిటీ ఇచ్చారు.
తీవ్ర మైన పోటీ ఉన్న జూన్ లోనే ఈ సినిమాను విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారు.ప్రస్తుతం సినిమా షూటింగ్ బ్యాలన్స్ ఉంటే దాన్ని కంప్లీట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
రొమాంటిక్ సినిమా లోని కొన్ని సీన్స్ ను రీ షూట్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.ఆ విషయమై ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ లేదు.కాని ఎట్టకేలకు ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించిన నేపథ్యంలో పూరి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఈ సినిమా లో ఆకాష్ పూరికి జోడీగా కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెల్సిందే.
వీరిద్దరి కాంబో రొమాంటిక్ సీన్స్ మరో లెవల్ లో ఉంటాయని అంటున్నారు.