దేశంలో కరోనా వైరస్ కేసులు గత కొన్ని రోజుల నుండి భారీగా పెరుగుతున్న క్రమంలో ఇటీవల తగ్గాయి.కేంద్ర ఆరోగ్య వైద్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం దేశవ్యాప్తంగా గడచిన 24 గంటల్లో కొత్తగా నమోదైన కేసుల సంఖ్య 15,510.
దీంతో దేశ వ్యాప్తంగా నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,10,96,731కి చేరింది.
ఇందులో 1,07,86,457 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 1,68,627 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.
ఇక గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కరోనా కారణంగా106 మంది చనిపోవడంతో.దేశవ్యాప్తంగా మొత్తం కరోనా మృతుల సంఖ్య 1,57,157 కి చేరింది.ఇదిలాఉంటే కరోనా పాజిటివ్ కేసులు ఇటీవల మహారాష్ట్ర అదేవిధంగా కేరళలో అత్యధికంగా నమోదవుతున్న తరుణంలో కేంద్రం ఆ రాష్ట్రాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉంది.
.