రౌడీ స్టార్ గా టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న హీరో విజయ్ దేవరకొండ.ఈ మధ్యకాలంలో యూత్ లో మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకొని దూసుకుపోతున్న ఈ యంగ్ హీరో ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతుంది.పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా విజయ్ కెరియర్ లో హైయెస్ట్ బడ్జెట్ చిత్రంగా ఉంది.
ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండకి జోడీగా బాలీవుడ్ భామ అనన్యా పాండే నటిస్తుంది.ఇదిలా ఉంటే హీరోగా టాప్ స్టార్స్ రేంజ్ లో స్టార్ దర్శకుల సినిమాలలో నటిస్తున్న విజయ్ మరో వైపు నిర్మాతగా కొత్త దర్శకులని ఎంకరేజ్ చేస్తూ కొత్త కథలని పరిచయం చేస్తున్నాడు.
ఇప్పటికే విజయ్ దేవరకొండ నిర్మాతగా మీకు మాత్రమే చెప్తా అనే తెరకెక్కింది.
ఈ సినిమా ఎవరేజ్ టాక్ సొంతం చేసుకుంది.
ఇప్పుడు నిర్మాతగా తన రెండో సినిమాని విజయ్ దేవరకొండ తెరకెక్కించే పనిలో ఉన్నాడు.ఇక ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్, క్యాస్టింగ్, దర్శకుడి పేరుని ఈ రోజు విజయ్ దేవరకొండ ఎనౌన్స్ చేయడానికి రెడీ అయ్యాడు.
యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గానే ఈ కాన్సెప్ట్ ని డిజైన్ చేసి ఆవిష్కరించబోతున్నట్లు తెలుస్తుంది.ఈ సినిమాతో మరో కొత్త దర్శకుడుని పరిచయం చేయనున్నట్లు తెలుస్తుంది.
మరి రౌడీ విజయ్ నిర్మిస్తున్న సెకండ్ సినిమా ఎలా ఉండబోతుందో అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.ఇదిలా ఉంటే సుకుమార్ దర్శకత్వంలో విజయ్ నటించే సినిమా పుష్ప షూటింగ్ కంప్లీట్ అయిన వెంటనే స్టార్ట్ కాబోతుందని తెలుస్తుంది.