1.రిటైర్డ్ ఉద్యోగులకు ఉచిత బస్సు ప్రయాణం
రిటైర్డ్ ఉద్యోగులు, వారి భార్యలు/ భర్తలు చనిపోయిన ఉద్యోగుల భార్యలు, భర్తలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తూ తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది.
2.ఎడ్ సెట్ ప్రశ్నాపత్రం విధానంలో మార్పు
ఎడ్ సెట్ ప్రవేశ పరీక్ష ప్రశ్నాపత్రం విధానం మారింది.కంప్యూటర్ విద్యకు సంబంధించిన అంశాలను చేర్చుతూ టెస్ట్ కమిటీ చేసిన సిఫార్సులను తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఆమోదించింది.
3.89 పోస్టులతో యూపీఎస్సీ నోటిఫికేషన్
కేంద్ర ప్రభుత్వం వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ( యుపిఎస్సి ) నోటిఫికేషన్ విడుదల చేసింది.ఈ నోటిఫికేషన్ ద్వారా 89 పోస్టులను భర్తీ చేయనున్నారు.
4.తిప్పలు పెడుతున్న ఏ 2 పులి
కొమరం భీమ్ జిల్లా బెజ్జూర్ మండలం లో మరోసారి ఏ 2 పులి సంచారం కలకలం రేపుతోంది.గ్రామ శివారులో ఉన్న పశు కళేబరాన్ని పులి తిని వెళ్ళిపోయింది.
5.తెలంగాణ లో కరోనా
గడచిన 24 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 176 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
6.యాదాద్రికి సీఎం కేసీఆర్
మార్చి 4వ తేదీన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి ఆలయాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ సందర్శించనున్నట్టు సమాచారం.
7.కీలక అధికారులతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ భేటీ
ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదివారం విజయవాడలోని తన కార్యాలయంలో సాయంత్రం రాష్ట్రంలోని కీలకమైన ఉన్నతాధికారలతో భేటీ కానున్నారు.
8.వ్యాక్సిన్ వికటించి మహిళ మృతి
విజయవాడ సార్ నగర్ లో కరోనా వ్యాక్సిన్ ప్రకటించి అంగన్వాడీ ఆయా బేగం మృతి చెందినట్లు సమాచారం.
9.అమితాబ్ కు సర్జరీ
బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ సర్జరీ చేయించుకున్నారు.ఈ విషయాన్ని స్వయంగా అమితాబ్ తెలిపారు.ఈ విషయాన్ని స్వయంగా అమితాబచ్చన్ ప్రకటించారు.
10.రేపు ఎడ్ సెట్ నోటిఫికేషన్ విడుదల
టీఎస్ ఎడ్ సెట్ 2021 రేపు ఉన్నత విద్యామండలి విడుదల చేయనుంది.
11.బెంగళూరులో మెట్రో సర్వీసులు తగ్గింపు
కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో మెట్రో సర్వీసులను తగ్గించనున్నట్లు అధికారులు వెల్లడించారు.ఫిబ్రవరి 28వ తేదీన బెంగళూరు మెట్రో పర్పుల్ లైన్ సర్వీసులను తగ్గించడం ఉన్నట్లు బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ సి పి ఆర్ ఓ తెలిపింది.
12.రామగుండం ఎరువుల కర్మాగారం ట్రయిల్ రన్ ప్రారంభం
రామగుండం లో ఎరువుల కర్మాగారం ట్రైల్ రన్ ను అధికారులు ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి సీఈవో నిర్లప్ సింగ్ హాజరయ్యారు .
13.మార్చి లో 11 రోజులు బ్యాంకులకు సెలవులు
మార్చి నెలలో దేశవ్యాప్తంగా 11 రోజులు బ్యాంకులకు సెలవు రానున్నాయి.ఇందులో నాలుగు ఆదివారాలు, 2 రెండవ శనివారాలు ఉన్నాయి.
రిజర్వ్ బ్యాంక్ క్యాలెండర్ ప్రకారం మార్చి నెలలో వివిధ రాష్ట్రాల్లో ఐదు రోజులు సెలవు దినాలు ఉండనున్నాయి.కి సెలవు రాష్ట్రాలను బట్టి మారుతాయి.
14.సంక్రాంతికి రానున్న పవర్ స్టార్
పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న ఓ సినిమాను ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.పవన్ కళ్యాణ్ క్రిష్ కాంబినేషన్లో ఈ సినిమా తెరకెక్కుతోంది.
15.తల్లి కాబోతున్న హీరోయిన్ రీచా
తాను తల్లి కాబోతున్నట్లు స్వయంగా ప్రముఖ సిని హీరోయిన్ రీచా గంగోపాధ్యాయ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.
16.తెలంగాణ వ్యాప్తంగా రేపటినుంచి కోవిడ్ టీకా
రేపటి నుంచి 60 ఏళ్లు పైబడిన వారు , 45 నుంచి 59 ఏళ్ల మధ్య దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికి వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలంగాణ ప్రజా ఆరోగ్య సంచాలకులు శ్రీనివాసరావు వెల్లడించారు.
17.విజయ్ దేవరకొండ సరసన రష్మీక
గీతా గోవిందం చిత్రం తో విజయ్ దేవరకొండ తో కలిసి సందడి చేసిన టాప్ హీరోయిన్ రష్మిక మందన్న మరోసారి విజయ్ దేవరకొండ తో జోడి కట్టనున్నారు.సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న విజయ్ దేవరకొండ సినిమాలో రష్మికను హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు సమాచారం.
18.సీతారాముల ఆలయ స్తంభాలు ధ్వంసం
ఏపీ లోని కర్నూలు జిల్లా డోన్ మండలం వెంకట నాయుని పల్లె లో నిర్మాణంలో ఉన్న సీతారాముల ఆలయానికి చెందిన రెండు రాతి స్తంభాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.
19.కాంగ్రెస్ నుంచి రమేష్ రాథోడ్ సస్పెండ్
అదిలాబాద్ మాజీ ఎంపీ సీనియర్ నేత రమేష్ రాథోడ్ ను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 44,930 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 45,930
.