ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసిన మణిరత్నం

లెజెండరీ దర్శకుడుగా తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న వ్యక్తి మణిరత్నం.అతనితో సినిమా అంటే ఎంత పెద్ద స్టార్ హీరో అయిన కనీసం కథ ఏంటి అనే విషయం కూడా వినకుండా ఒకే చెప్పేస్తాడు.

 Ponniyin Selvan Shooting Completed In Hyderabad, Manirathnam, Aishwarya Rai, Vik-TeluguStop.com

హీరోలకి అతనంటే అంత గుడ్డి నమ్మకం.ఆ నమ్మకాన్ని నిలబెట్టే విధంగానే మణిరత్నం సినిమాలు ఉంటాయి.

ఒక వేళ అతని సినిమా ఫ్లాప్ అయిన అందులో నటించిన నటులకి మాత్రం మంచి గుర్తింపు వస్తుంది.ఆ విధంగా అతని సినిమాలలోని కథనాలు, పాత్రల చిత్రణ ఉంటుంది.

అందుకే మణిరత్నం సినిమాలో ఓ చిన్న పాత్ర వచ్చిన చాలనుకునే హీరోయిన్స్ ఉన్నారు.ఇదిలా ఉంటే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్యా రాయ్ ని ఇండస్ట్రీకి పరిచయం చేసిన వ్యక్తి మణిరత్నం.

ఇద్దరు సినిమాలో ఆమెని మొదట హీరోయిన్ గా పరిచయం చేశారు.ఆ సినిమా తర్వాత ఐశ్వర్య రాయ్ కెరియర్ వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా దూసుకుపోయింది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం మణిరత్నం తన డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వన్ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు.భారీ బడ్జెట్ తో స్టార్ క్యాస్టింగ్ తో మల్టీ స్టారర్ చిత్రంగా ఈ సినిమా తెరకెక్కుతుంది.

కార్తి, విక్రమ్, జయం రవి, ఐశ్వర్య రాయ్, త్రిష లాంటి స్టార్ నటులు ఈ సినిమాలో నటిస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ మొదటి షెడ్యూల్ ని తాజాగా పూర్తి చేశారు.

నిర్విరామంగా 60 రోజుల పాటు ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ జరిగింది.తూర్పుగోదావరి జిల్లా పోలవరంలో కూడా ఓ పాటని చిత్రీకరించారు.

ఈ షెడ్యూల్ లో హీరోలు విక్రమ్, జయం రవి, ఐశ్వర్య రాయ్ కి సంబందించిన సన్నివేశాలతో పాటు సాంగ్ ని షూట్ చేశారు.హైదరాబాద్ లోరామోజీ ఫిలిం సిటీలో కీలక సన్నివేశాలని చిత్రీకరించారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube