తెలుగులో ప్రముఖ దర్శకుడు రమేష్ వర్మ దర్శకత్వం వహించిన “రాక్షసుడు (రాటసన్ తమిళ చిత్ర రీమేక్)” చిత్రం తెలుగు సినీ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ చిత్రంలో హీరో హీరోయిన్లుగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మరియు అనుపమ పరమేశ్వరన్ నటించగా టాలీవుడ్ ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల, తమిళ చైల్డ్ ఆర్టిస్ట్ అమ్ము అభిరామి, వినోదిని, శోభరాజ్, తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు.
సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిన ఈ చిత్రం సినీ ప్రేక్షకులని బాగానే అలరించింది. అయితే ఈ చిత్రంలో హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మేనకోడలి పాత్రలో నటించిన అమ్ము అభిరామి తన నటనా ప్రతిభతో సినీ ప్రేక్షకులని బాగానే ఆకట్టుకుంది.
అయితే ప్రస్తుతం అమ్ము అభిరామి వరుస సినిమా అవకాశాలు దక్కించుకుంటూ హీరోయిన్ గా బాగానే రాణిస్తోంది ఇటీవలే తెలుగులో విద్యా సాగర్ రాజు దర్శకత్వం వహించిన F.C.U.K (ఫాదర్ చిట్టి ఉమా కార్తీక్) చిత్రంలో హీరోయిన్ గా నటించింది.అయితే ఈ చిత్రం ప్రేక్షకులని పెద్దగా ఆకట్టుకోకపోయినప్పటికీ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన అమ్ము అభిరామి కి మాత్రం సినీ విమర్శకుల నుంచి మంచి మార్కులే పడ్డాయి. అంతేగాక ఈ చిత్రంలో అభిరామి వర్జినిటీ గురించి చెప్పేటువంటి సన్నివేశాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
దీంతో ఈ అమ్మడికి రోజు రోజుకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎం మరియు క్రేజ్ బాగానే పెరుగుతోంది.ఈ క్రమంలో దర్శకనిర్మాతలు అవకాశాలు కూడా బాగానే ఆఫర్ చేస్తున్నారు.
అయితే గతంలో అభిరామి ధనుష్ హీరోగా నటించిన “అసురన్” చిత్రంలో కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి సినీ విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు అందుకుంది.కాగా ప్రస్తుతం అభిరామి తమిళంలో ప్రముఖ సినీ నిర్మాత “మణి రత్నం” నిర్మాతగా వ్యవహరిస్తున్న “నవరస” అనే వెబ్ సిరీస్ లో కీలక పాత్రలో నటిస్తోంది.అంతేకాక మరో ప్రముఖ దర్శకుడు తెరకెక్కిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రంలో కూడా నటించేందుకు ఇటీవలే అభిరామి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.ఇప్పటివరకు మంచి పాత్రలను ఎన్నుకుని కెరీర్ ని మొదలు పెట్టిన అభిరామి ఇలాగే తన తదుపరి చిత్ర కథల విషయంలో కూడా సరైన నిర్ణయాలు తీసుకుంటే నటిగా మంచి భవిష్యత్తు ఉంటుందని కొందరు సినీ క్రిటిక్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.