దేశంలో కరోనా టీకా రెండో దశ మొదలైంది.ఇప్పటికే కోవిడ్ టీకా పట్ల అవగహన ఉన్నవారు, మరియు మొదటి డోస్ తీసుకున్న వారు రెండో డోస్ టీకాలను వేసుకుంటున్నారు.
ఇక కోవిడ్ 19 మొదటి వ్యాక్సిన్ తీసుకున్న సమయంలో కొంత అపశృతి దొర్లిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో కొన్ని మరణాలు చోటు చేసుకున్న విషయం విదితమే.
కాగా తాజాగా రెండో డోస్ వేసుకున్నట్లుగా చెబుతున్న ఓ అంగన్ వాడి కార్యకర్త అస్వస్థతకు గురైందట.ఆ వివరాలు చూస్తే.అనంతపురం జిల్లాలోని రాణీ నగర్కు చెందిన శకుంతల అనే అంగన్ వాడి మహిళ శుక్రవారం కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకుందట.
కాగా ఈ వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత స్వల్ప అస్వస్థతకు గురవడంతో, ఈమె ఆరోగ్యం పై వైద్యాధికారులను ఉన్నతాధికారులు వివరాలు అడిగి తెలుసుకున్నారట.
అంతే కాకుండా శకుంతలకు ప్రభుత్వ ఆస్పత్రిలోని ఏఎంసీ వార్డులో వైద్యులు చికిత్సను అందిస్తున్నారని సమాచారం.