టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ ఈరోజు పెద్దపల్లి జిల్లాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.కాగా ఈ నెల 17న దారుణ హత్యకు గురైన హైకోర్టు అడ్వకేట్లు గట్టు వామన్ రావు, పీవీ నాగమణిల కుటుంబాన్ని పరామర్శించేందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈరోజు వెళ్లారు.
అయితే ఉత్తమ్ రాక సందర్భంగా ఎన్టీపీసీలోని మిలినియం హాల్లో ప్రెస్ మీట్ ఉంటుందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు జర్నలిస్టులకు సమాచారం ఇచ్చాయి.దాంతో జర్నలిస్టులంతా ఉదయం 9.30 గంటల నుండి 11.30 వరకు మిలినియం హాల్ వద్ద పడిగాపులు కాచారు.కానీ ఉత్తమ్ మాత్రం హైదరాబాద్ నుంచి ఎన్టీపీసీ గెస్ట్ హౌజ్కు చేరుకున్నాడు.గానీ మిలీనియం బ్లాక్ కు మాత్రం చేరలేదట.
అప్పటికే రెండు గంటల పాటు ప్రెస్ మీట్ కోసం ఎదురుచూసి విసిగి వేసారిన మీడియా ప్రతినిధులు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ కవర్ చేయమంటూ అక్కడి నుండి వెళ్లిపోయారట.కాగా ప్రెస్మీట్ ఏ సమయంలో ఉందో అన్న విషయంలో క్లారీటి లేని కాంగ్రెస్ నేతల మీద మండిపడుతున్నారట జర్నలిస్టులు.