తెలుగులోని ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానెల్స్ లో ఒకటైన జెమినీ టీవీలో జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా మీలో ఎవరు కోటీశ్వరుడు షో ప్రసారం కానుందంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.బిగ్ బాస్ సీజన్ 1ను హోస్ట్ చేసి సీజన్ 1 సక్సెస్ కు కారణమైన ఎన్టీఆర్ మీలో ఎవరు కోటీశ్వరుడు షోను కూడా సక్సెస్ చేస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
అయితే జెమిని టీవీలో ఎన్టీఆర్ తో పాటు రానా కూడా సందడి చేయనున్నారని తెలుస్తోంది.
గతంలో నంబర్ 1 యారి అనే ప్రోగ్రామ్ కు హోస్ట్ గా వ్యవహరించిన రానా ఈ ప్రోగ్రామ్ మూడవ సీజన్ తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నారని తెలుస్తోంది.
ఎన్టీఆర్, రానా వేర్వేరుగా ఒకే ఛానల్ లో రెండు ప్రోగ్రామ్స్ తో సందడి చేయనున్నారు. ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న షో పేరు ఎవరు మీలో కోటీశ్వరుడు అని మే నెల ఫస్ట్ వీక్ నుంచి ఈ షో ప్రసారం కానుందని మొత్తం 60 ఎపిసోడ్ లు ఉంటాయని తెలుస్తోంది.
రానా, ఎన్టీఆర్ షోల వల్ల జెమినీ టీవీ ఇతర ఎంటర్టైన్మెంట్ ఛానెల్స్ కు మరింత గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తున్నట్టు భావిస్తున్నట్టు తెలుస్తోంది.ఇద్దరు స్టార్ హీరోలు సందడి చేస్తే ప్రేక్షకులకు డబుల్ డోస్ ఎంటర్టైన్మెంట్ అందుతుందని చెప్పవచ్చు.ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ షూటింగ్ తో బిజీగా ఉన్న తారక్ మే నెల నుంచి త్రివిక్రమ్ మూవీ షూటింగ్ లో కూడా పాల్గొనబోతున్నారని సమాచారం.
రానా హోస్ట్ చేసిన నెంబర్ 1 యారి రెండు సీజన్లు హిట్ అయ్యాయి.
ప్రస్తుతం రానా అరణ్య, విరాటపర్వం సినిమా షూటింగ్ లతో బిజీగా ఉన్నారు.ఈ ఏడాదే ఈ రెండు సినిమాలు విడుదల కానున్నాయి.రేటింగ్స్ పరంగా వెనుకబడ్డ జెమినీ టీవీ ఎన్టీఆర్, రానా షోల ద్వారా నంబర్ 1 లేదా నంబర్ 2 స్థానాన్ని కైవశం చేసుకోవాలని ప్రయత్నిస్తోంది.