తమిళ్ స్టార్ హీరో విజయ్ మాస్టర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.
భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమాని తెరకెక్కించడానికి దర్శకుడు రెడీ అవుతున్నాడు.విజయ్ లాంటి స్టార్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ రావడంతో నెల్సన్ దిలీప్ తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమాలో హీరోయిన్ కోసం వేట సాగిస్తున్నారు.ఇందులో హీరోయిన్ పాత్ర కోసం ముఖ్యంగా పూజా హెగ్డే పేరు వినిపిస్తుంది.
సౌత్, బాలీవుడ్ ప్రస్తుతం మోస్ట్ క్రేజీయిస్ట్ హీరోయిన్ గా పూజా హెగ్డే తన హవా కొనసాగిస్తుంది.ఈ నేపధ్యంలో ఆమెని హీరోయిన్ గా తీసుకుంటే విజయ్ కి బెస్ట్ అవుతుందని, తెలుగు, హిందీలో కూడా సినిమాకి మంచి బూస్టింగ్ అవుతుందని దర్శక, నిర్మాతలు భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది.
ఈ టాక్ పై తాజాగా పూజా హెగ్డే రియాక్ట్ అయ్యింది.కెరియర్ ఆరంభంలో పూజా తమిళంలో మాస్క్ అనే సినిమా చేసింది.ఈ సినిమా పర్వాలేదనే టాక్ వచ్చిన ఆమె కెరియర్ కి ఏ విధంగాను ఉపయోగపడలేదు.ఈ నేపధ్యంలో కోలీవుడ్ లో రీ-ఎంట్రీ గ్రాండ్ గా ఉండాలని అనుకుంటుంది.
ఒకవేళ నాకు ఆ సినిమాలో భాగస్వామ్యం అయ్యే అవకాశం వస్తే గొప్పగా భావిస్తా అంటూ పూజా హెగ్డే కామెంట్స్ చేసింది.తమిళంలో నా డెబ్యూట్ సినిమా చేసినప్పటి నుంచి ఏదో ఒక సినిమా చేయాలని అనుకుంటూనే ఉన్నా.
ఇది వర్కవుట్ అయ్యి ఈ అందమైన ప్రాజెక్టులో నేను కూడా నటిస్తానని ఆశిస్తున్నా.ఈ ఆఫర్ వర్కవుట్ అవుతుందా అని చాలా ఎక్జయిటింగ్గా ఎదురుచూస్తున్నానని చెప్పుకొచ్చింది.