ఏపీ వైద్య ఆరోగ్య శాఖ తాజాగా హెల్త్ బులిటెన్ విడుదల చేయడం జరిగింది.గడచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 34,778 కరోనా పరీక్షలు చేస్తే 96 కొంత పాజిటివ్ కేసులు నిర్ధారణ కావడంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,89,681కు పెరిగింది.
కాగా ఈ మహమ్మారి వల్ల రాష్ట్రవ్యాప్తంగా ఒకరు మృతి చెందటంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 7,169 కి చేరింది.
కొత్తగా 96 కేసులు నమోదు కావడంతో ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ గా ఉన్న కేసుల సంఖ్య 635 వీరిలో కొంతమంది హాస్పిటల్లో మరికొంతమంది ఇంటి వద్దనే ఉండి చికిత్స తీసుకుంటున్నారు.
గడిచిన 24 గంటల 71 మంది బాధితులు కరోనా నుండి కోలుకోవటంతో పూర్తిగా కోలుకున్న వారి సంఖ్య 8,89,681కు పెరిగింది.చాలా వరకు రాష్ట్రంలో కరోనా అదుపులోనే ఉన్నట్లు తాజా గణాంకాలను బట్టి తెలుస్తోంది.