మెగా ఫ్యామిలీ నుండి హీరోగా పరిచయం అయిన వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా తోనే స్టార్ హీరోల జాబితాలో చేరిపోయాడు.ఉప్పెన సినిమా వంద కోట్లకు చేరువలో నిలిచింది.
త్వరలోనే ఆ మార్క్ కూడా దక్కించుకునే అవకాశం ఉంది అంటున్నారు.కరోనా సమయంలో ఇలా వంద కోట్లు సాధించడం అది కూడా కొత్త హీరో కొత్త దర్శకుడి సినిమా అయినా కూడా వంద కోట్లను దక్కించుకోవడం అంటే మామూలు విషయం కాదు.
ఇది ఖచ్చితంగా వైష్ణవ్ తేజ్ కెరీర్ మొత్తం కు చిరస్మరణీయం అనడంలో సందేహం లేదు.అలాంటి చిరస్మరణీయ సక్సెస్ ను దక్కించుకున్న వైష్ణవ్ తేజ్ రెండవ సినిమాను మెగా అభిమానులు మరో రేంజ్ లో ఊహించుకుంటున్నారు.
ఆయన రెండవ సినిమా భారీ స్థాయిలో సక్సెస్ ను దక్కించుకుంటుందని ఇప్పటికే ప్రచారం చేస్తున్నారు.ప్రస్తుతం వైష్ణవ్ రెండవ సినిమా చర్చలు జరుగుతున్నాయి.
వైష్ణవ్ తేజ్ రెండవ సినిమా ఇప్పటికే క్రిష్ దర్శకత్వంలో పూర్తి అయిన విషయం తెల్సిందే.కొండ పొలం అనే ఒక పాత నవల ఆధారంగా రూపొందిన సినిమాలో వైష్ణవ్ తేజ్ నటించాడు.
రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది.వీరిద్దరి మద్య రొమాంటిక్ సీన్స్ ఉంటాయా లేదంటే ఇదో ఆర్ట్ పిల్మ్ మాదిరిగా ఉంటుందా అనేది తెలియాల్సి ఉంది.
ఈ సినిమాను దర్శకుడు క్రిష్ కేవలం రెండున్నర నుండి మూడు నెలల గ్యాప్ లోనే పూర్తి చేశాడు.ఉప్పెన తర్వాత మరో లెవల్ లో సినిమా పై అంచనాలు ఉంటే కొండ పొలం వంటి నవల ను సినిమా గా చేయడం అంటే కాస్త ఆలోచించాల్సిన పరిణామం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.
మెగా ఫ్యామిలీ అభిమానులు వైష్ణవ్ తేజ్ ఉప్పెన విడుదలకు ముందే ఈ సినిమాను ఒప్పుకుని తప్పు చేశాడేమో అంటున్నారు.మొత్తానికి కొండ పొలం విషయంలో మెగా ఫ్యాన్స్ ఒకింత అసంతృప్తితో ఉన్నారు.
కమర్షియల్ సినిమా కోసం వారు వెయిట్ చేస్తున్నారు.మరి మూడవ సినిమా అయినా కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఉంటుందేమో చూడాలి.