విద్యార్ధుల ఫీజుల విషయంలో ప్రైవేట్ స్కూల్స్, కాలేజీల దోపిడి మామూలుగా ఉండదు అన్న విషయం తెలిసిందే.నేడు చదువు కొనుక్కునే పరిస్దితులు తలెత్తాయి.
పోని ఇన్నేసి ఫీజులు వసూల్ చేస్తున్నా వసతులు సరిగా ఉండవు.ఈ నేపధ్యంలో ప్రైవేట్ కాలేజీల విషయంలో హైకోర్ట్ వీటికి షాకిచ్చింది.
కాగా హైకోర్టులో జూనియర్ కాలేజీల్లో అమలు చేస్తున్న అగ్నిమాపక నిబంధనలపై విచారణ జరిగింది.అగ్నిమాపక శాఖ నిబంధనలపై శ్రీచైతన్య, నారాయణ, గాయత్రి కాలేజీల పిటిషన్లపై కూడా విచారణ జరిపింది.
అయితే ఇంటర్ బోర్డ్ మాత్రం నిబంధనలు పాటించని కాలేజీలు మూసివేశామని, ఇందులో భాగంగా నారాయణ, శ్రీచైతన్య కాలేజీలతో సహా మరో 40 కాలేజీలు మూసివేశామని ఇంటర్ బోర్డు పేర్కొంది.
ఇదే సమయంలో చట్టం రాకముందు నిర్మించిన భవనాలకు కూడా అనుమతివ్వడం లేదని కాలేజీల యాజమాన్యాలు పేర్కొంటుండగా, నిబంధనలకు అనుగుణంగా లేని భవనాల్లో కాలేజీలు ఎలా కొనసాగిస్తారని ప్రశ్నించిన హైకోర్టు కొన్ని కాలేజీలు కేవలం లాభాల కోసం నడుపుతున్నాయని వ్యాఖ్యానించింది.
ఇక కాలేజీల వాదన ఏ మాత్రం సహేతుకంగా లేదని వెల్లడిస్తూ కాలేజీల పిటిషన్లపై తీర్పు రిజర్వ్ చేసింది హైకోర్టు.
ఇకపోతే ప్రతి కాలేజీలు ఖచ్చితంగా అగ్నిమాపక నిబంధనలు పాటించాలసిందేనని తేల్చి చెప్పింది ఇలా నిబంధనలు పాటించని కాలేజీలపై 3 వారాల్లో నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది.