తెలంగాణ మంత్రి హరీష్ రావు ఇటీవల ఓ పాఠశాలలో పర్యటించారు.మెదక్ జిల్లా పాపన్నపేట మండలం కొత్తపల్లి గ్రామంలో జిల్లా పరిషత్ స్కూల్ కి హరీష్ రావు వెళ్లి.
అక్కడ విద్యార్థులతో ముచ్చటించడానికి టీచర్ గా అవతారం ఎత్తారు.ఈ సందర్భంగా పాఠశాలలో ఉన్న సదుపాయాలను అంతా పరిశీలించారు.
తరువాత విద్యార్థులతో ముచ్చటించడం జరిగింది.
ఈ సందర్భంగా వారిని స్కూల్ లో ఉన్న ఇబ్బందుల గురించి అదే విధంగా ఇంకా ఎలాంటి విషయాలైన చెప్పవచ్చు అంటూ ఓపెన్ గా మాట్లాడారు.వైరస్ కష్టాలు గురించి అడిగి తెలుసుకున్నారు.కరోనా మహమ్మారి తర్వాత స్కూల్ ఓపెన్ అవటం పట్ల విద్యార్థుల స్పందన తెలుసుకున్నారు.
ఇదే తరుణంలో తెలుగు మరియు లెక్కలు టెక్స్ట్ బుక్స్ తీసుకుని విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి.పెద్దయిన తర్వాత ఏమవుతావు అని అందరిని ప్రశ్నించారు.ఈ విధంగా హరీష్ రావు ప్రజలతో పాటు విద్యార్థులతో మమేకమవుతూ మరోసారి ఆసక్తికరంగా మారారు.
.