రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన మూవీ క్రాక్ విడుదల సమయంలో కాస్త గందరగోళ పరిస్థితులు ఏర్పాడ్డాయి.ఆ సినిమా ను విడుదల చేసేందుకు ఠాగూర్ మధు చాలా ఇబ్బందులు పడ్డాడు.
అలా ఇబ్బంది పడ్డ సినిమా సూపర్ హిట్ దక్కించుకుంది.దాంతో సినిమా భారీ వసూళ్లను దక్కించుకుంది.
ఈ సినిమా ను నైజాం ఏరియాలో వరంగల్ శ్రీను డిస్ట్రీబ్యూట్ చేయడం జరిగింది.క్రాక్ మంచి వసూళ్లను రాబడుతున్న సమయంలో అనూహ్యంగా దిల్ రాజు తాను తీసుకున్న సినిమాలను విడుదల చేసేందుకు గాను క్రాక్ ను తొలగించడం జరిగింది.
దాంతో నైజాం ఏరియా క్రాక్ డిస్ట్రిబ్యూటర్ అయిన వరంగల్ శ్రీనుకు కోపం వచ్చింది.ప్రెస్ మీట్ పెట్టి మరీ దిల్ రాజును ఏకి పారేశాడు.
ఆ విషయం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది.కోట్ల రూపాయలు పెట్టి డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ను కొనుగోలు చేస్తే ఇదా పరిస్థితి అంటూ దిల్ రాజును ప్రశ్నించిన శ్రీను ఆ తర్వాత కూడా తన ఫైర్ బ్రాండ్ ను కంటిన్యూ చేస్తున్నాడు.
క్రాక్ సినిమా సమయంలో వచ్చిన పాపులారిటీని ఉపయోగించుకుని నిర్మాతగా వరుస సినిమాలు చేయాలని వరంగల్ శ్రీను ప్రయత్నాలు చేస్తున్నాడు.మొదటగా పెద్ద సినిమాలను ముఖ్యంగా దిల్ రాజు తీసుకోవాలనుకుంటున్న సినిమాలను రూపాయి ఎక్కువ ఇచ్చి కొనుగోలు చేయాలని శ్రీను భావిస్తున్నాడట.
ఆ విషయమై ఇప్పటికే పాతిక కోట్ల వరకు ఖర్చు చేసి చిన్న పెద్ద సినిమాలను వరంగల్ శ్రీను దక్కించుకున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.పెద్ద ఎత్తున వరంగల్ శ్రీను సినిమాలు కొనుగోలు చేస్తున్న కారణంగా దిల్ రాజుకు నిర్మాణం విషయంలో కూడా పోటీ వచ్చే అవకాశాలు ఉన్నాయని ఈయన మరో దిల్ రాజుగా మారే విషయం కూడా మనం త్వరలో చూస్తామని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.