భార్యకు శీల పరీక్ష పెట్టిన అనగానే అందరికీ గుర్తొచ్చేది రామాయణం సీత లంక నుంచి వచ్చిన తర్వాత రాముడు అనుమానించి సీతకు పరీక్ష పెట్టిన విషయం మనందరికీ తెలిసిందే.అయితే అచ్చం ఇలాగే ఓ సంఘ ఘటన జరిగింది.
భార్యకు ఓ భర్త శీల పరీక్ష పెట్టారు.ఏంటి ఈ కాలంలో శీల పరీక్షఏంటి అనుకుంటున్నారా.
కొన్ని ప్రదేశాల్లో ఇంక అటువంటి క్రూరంగా ప్రవర్తించేవారు ఉన్నారు.ఇక అసలు విషయంలోకి వెళ్తే మహారాష్ట్ర లోని ఉస్మాబాద్ జిల్లాలో తన భార్యకు శీల పరీక్షగా సలసలకాగే నూనెలో రూ.5 నాణెం వేసి తన భార్యను ఆ నూనెలోంచి ఆ నాణేన్ని తీయమన్నాడు.అయితే ఇలా శీల పరీక్ష విధించడానికి గల కారణమేమనగా తన భర్తతో గొడవ జరగడంతో నాలుగు రోజులు ఇంట్లో నుండి వెళ్ళిపోయింది.
అయితే ఇంటికి వచ్చిన తరువాత నాలుగు రోజులు ఎటు వెళ్లావని భర్త ప్రశ్నించడంతో నేను బస్ స్టాప్ లో నిలుచున్నప్పుడు ఇద్దరు వ్యక్తులు నన్ను బలవంతంగా బైక్ మీద తీసుకెళ్లి నాలుగు రోజులు ఒక రూంలో బంధీగా ఉంచారని భార్య చెప్పడంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.ప్రస్తుతం నెటిజన్లను ఎంతగానో ఆగ్రహానికి గురి చేస్తున్న ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.నెటిజన్లు ఆ దుర్మార్గుడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి మరి.
.