ప్రపంచం ఒక వైపు టెక్నాలజీ, పురోగతి వైపు దూసుకు వెళుతుంటే మరోవైపు మూఢనమ్మకాలతో ప్రజలు కొన్ని ప్రాంతాలలో అలాగే ఉండిపోతున్నారు.ఇందులో భాగంగానే తాజాగా ఓ ఇంట్లో దయ్యం ఉందని ఏకంగా ఆ ప్రాంతానికి చెందిన కాలనీవాసులు మొత్తం వారి ఇళ్లను ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు.
ప్రాణభయంతో అక్కడ ఉన్న ప్రజలు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు.ఈ సంఘటన తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని జనగామ జిల్లా తరిగొప్పుల మండలంలో ఉన్న పోతారం గ్రామంలో చోటు చేసుకుంది.
ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.
ప్రస్తుతం ఆ గ్రామంలో ఉన్న ఓ కాలనీ కి సంబంధించి ఏకంగా 40 కుటుంబాలు ఊరిని విడిచి వెళ్లిపోవడంతో ఆ కాలనీ పూర్తిగా నిర్మానుష్యంగా మారిపోయింది.
ఆ కాలనీలో ఉన్న ఓ ఇండ్లు గత పది సంవత్సరాలుగా నిరుపయోగంగా ఉందని ఆ పాట బిల్డింగ్ లో గత కొద్ది కాలం నుండి రాత్రి ఉదయం తిరుగుతుంది అంటూ ఆ ఊరిలో బాగా ప్రచారం జరిగింది.ఆ పాతబడిన బిల్డింగ్ లో ఓ మహిళ నగ్నం గా ఉండి బోనం ఎత్తుకొని డాన్స్ చేస్తున్నట్లు ఆ కాలనీవాసులు తెలిపారు.
ఈ మధ్య కాలంలోనే ఆ కాలనీలో ఉన్న ఇద్దరు అన్నదమ్ములు కేవలం వారం రోజుల సమయం లోనే మరణించడంతో, వారితో పాటు మరో వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మరణించడంతో వాడు అన్నిటికీ కారణం ఆ ఇంట్లో ఉండే దయ్యం కారణమై ఉంటుందని కాలనీవాసులు బలంగా నమ్మడంతో ఆ కాలనీలో ఉన్న 40 కుటుంబాలు ఒక్కొక్కరుగా వలసబాట పట్టారు.
దీంతో తాజాగా ఆ కాలనీ మొత్తం పూర్తిగా నిర్మానుష్యం అయిపోయింది.
ఆ కాలనీకి చెందిన ఓ వ్యక్తి మాట్లాడుతూ.కాలనీలో ఉన్న యువకులు మాత్రమే చనిపోతున్నారని అంతేకాకుండా ఎవరికైనా అనారోగ్యంగా ఉందని ఆసుపత్రికి వెళ్లగా అక్కడ అన్ని టెస్టులు చేయించుకొని చూడగా డాక్టర్లు వారికి ఎటువంటి సమస్య లేదని చెప్పడంతో.
దాంతో తాము ఉంటున్న ప్రదేశం సరైనది కాదని భావించి వారు ఆ కాలనీ ని ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు.