మనదేశాన్ని పాలించే నేతలు చెప్పేది ఒకటి జరుగుతున్నది ఒకటి.మన ఇండియా అభివృద్ధి పధంలో దూసుకు వెళ్లుతుందని అంటారు.
కానీ అప్పుల పరంగా ముందుందని చెప్పరు.ఇక ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి ఏంటని ప్రశ్నిస్తే ఏవేవో పిట్టకధలు చెబుతారు.
ఇక ఈ మధ్య ఇండియాలో వినిపిస్తున్న డిజిటల్ ఇండియా పథకం అనే పేరు, పేరుకే డిజిటల్ ఇండియా గా మిగిలిపోతుందంటారు ఈ విషయం తెలుసుకుంటే.ఆ వివరాల్లోకెళితే మధ్యప్రదేశ్, అశోక్ నగర్ జిల్లాలోని అంఖో గ్రామానికి ఆ రాష్ట్ర పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ మంత్రి బ్రిజేంద్ర సింగ్ యాదవ్ అధికారిక పర్యటనలో భాగంగా వచ్చారట.
ఈ క్రమంలో స్థానికులు తమ గ్రామంలో నెలకొన్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లగా, ఈ అంశం గురించి ఆఫీసర్లతో ఫోన్లో మాట్లాడేందుకు ప్రయత్నం చేయగా అతని ఫోన్లో సిగ్నల్స్ లేవట.దీంతో చేసేది ఏం లేక మంత్రి 50 అడుగుల ఎత్తులో గల జెయింట్ వీల్పైకి ఎక్కి ఫోన్ మాట్లాడారట.
ఇలా దాదాపు 3 గంటలపాటు అక్కడే కూర్చొని మాట్లాడిన మంత్రి ఫొటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.ఈ నేపథ్యంలో నెటిజన్లు కేంద్ర ప్రభుత్వ డిజిటల్ ఇండియా ప్రోగ్రాంను విమర్శిస్తూ, మీమ్స్, జోక్స్ ను నెట్టింట క్రియేట్ చేస్తున్నారట.