ఆ రాష్ట్ర మంత్రి 50 అడుగుల ఎత్తుపైకి వెళ్లాల్సివచ్చింది.. ఎందుకో తెలిస్తే నవ్వుతారు.. !

మనదేశాన్ని పాలించే నేతలు చెప్పేది ఒకటి జరుగుతున్నది ఒకటి.మన ఇండియా అభివృద్ధి పధంలో దూసుకు వెళ్లుతుందని అంటారు.

 The-state Minister Had To Go 50 Feet High Madhya Pradesh, Minister, Brijendra Si-TeluguStop.com

కానీ అప్పుల పరంగా ముందుందని చెప్పరు.ఇక ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి ఏంటని ప్రశ్నిస్తే ఏవేవో పిట్టకధలు చెబుతారు.

ఇక ఈ మధ్య ఇండియాలో వినిపిస్తున్న డిజిటల్ ఇండియా పథకం అనే పేరు, పేరుకే డిజిటల్ ఇండియా గా మిగిలిపోతుందంటారు ఈ విషయం తెలుసుకుంటే.ఆ వివరాల్లోకెళితే మధ్యప్రదేశ్, అశోక్ నగర్ జిల్లాలోని అంఖో గ్రామానికి ఆ రాష్ట్ర పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ మంత్రి బ్రిజేంద్ర సింగ్ యాదవ్ అధికారిక పర్యటనలో భాగంగా వచ్చారట.

ఈ క్రమంలో స్థానికులు తమ గ్రామంలో నెలకొన్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లగా, ఈ అంశం గురించి ఆఫీసర్లతో ఫోన్‌లో మాట్లాడేందుకు ప్రయత్నం చేయగా అతని ఫోన్‌లో సిగ్నల్స్ లేవట.దీంతో చేసేది ఏం లేక మంత్రి 50 అడుగుల ఎత్తులో గల జెయింట్ వీల్‌పైకి ఎక్కి ఫోన్ మాట్లాడారట.

ఇలా దాదాపు 3 గంటలపాటు అక్కడే కూర్చొని మాట్లాడిన మంత్రి ఫొటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.ఈ నేపథ్యంలో నెటిజన్లు కేంద్ర ప్రభుత్వ డిజిటల్ ఇండియా ప్రోగ్రాంను విమర్శిస్తూ, మీమ్స్, జోక్స్ ను నెట్టింట క్రియేట్ చేస్తున్నారట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube