కరోనాను జయించడంలో భారత్ ముందంజలో ఉందని అందరికి తెలిసిందే.ప్రపంచం మొత్తం కరోనా వల్ల భయంతో వణికిపోతున్న సమయంలో కూడా మనదేశంలో కరోనా మరణాల సంఖ్య తక్కువగా నమోదు అయ్యింది.
ఇక టీకా వచ్చాక ప్రతి వారికి అమృతం దొరికినంత ఆనందం కలిగింది.
అందుకే ఎప్పటిలా కరోనాను మరచి జీవించడం అలవాటు చేసుకున్నారు.
కానీ ఈ మధ్య మళ్ళీ కరోనా తన ప్రతాపం చూపించడం మొదలు పెట్టింది.క్రమక్రమంగా కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరగడం మొదలుపెట్టాయి.
ఇకపోతే కరోనా అంశం పై ఆదివారం ఉదయం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం ఎన్ని కేసులు నమోదు అయ్యాయో చూస్తే.
తెలంగాణలో గత 24 గంటల్లో తాజాగా 163 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయని ఆరోగ్యశాఖ వెల్లడించింది.ఇక ఒకరు ప్రాణలు కోల్పోగా, అదే సమయంలో 146 మంది కరోనా నుంచి కోలుకున్నారట.దీంతో రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,97,598 కి చేరింది.
కాగా ఇప్పటి వరకు కరోనాతో 1,624 మంది మృతి చెందారు.రాష్ట్రంలో ప్రస్తుతం 1,731 యాక్టివ్ కేసులు ఉండగా కరోనా నుంచి కోలుకుని 2,94,243 మంది డిశ్చార్జ్ అయినట్లు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.