అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సినిమాను చేస్తున్నాడు.ఆ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో సినిమాను ఆయన చేయబోతున్న విషయం తెల్సిందే.
కొరటాల ప్రస్తుతం మెగా స్టార్ చిరంజీవితో ఆచార్య సినిమా ను చేస్తున్నాడు.పుష్ప మరియు ఆచార్య సినిమాలు పూర్తి అవ్వడమే ఆలస్యం వీరిద్దరి కాంబోలో సినిమా పట్టాలెక్కడం ఖాయంగా కనిపిస్తుంది.
భారీ అంచనాలున్న ఈ సినిమా కోసం మెగా అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బన్నీ మరియు కొరటాల ఇద్దరికి కూడా ప్రస్తుతం వారు చేస్తున్న సినిమాలు కొన్ని కారణాల వల్ల ఆలస్యం అయ్యాయి.
ముఖ్యంగా కొరటాల శివ ఆచార్య సినిమా కోసం ఏకంగా మూడు ఏళ్ల పాటు వెయిట్ చేయాల్సి వచ్చింది.అందుకే బన్నీ సినిమాకు ఏమాత్రం ఆలస్యం లేకుండా ముందస్తు ప్లాన్ చేస్తున్నారు.
షూటింగ్ ప్రారంభం కు ఇంకా రెండు మూడు నెలల సమయం ఉండగానే నటీ నటుల ఎంపిక పక్రియ జరుగుతోంది.ఈమద్య కాలంలో తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటూ లక్కీ చామ్ గా మారిపోయిన తమిళ హీరోయిన్ కమ్ లేడీ విలన్ వరలక్ష్మి శరత్ కుమార్ ను కొరటాల శివ తన తర్వాత సినిమా అయిన బన్నీ సినిమా కోసం ఎంపిక చేసినట్లుగా సమాచారం అందుతోంది.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం లేడీ విలన్ పాత్ర కోసం ఆమెను సంప్రదించారట.నాంది సినిమాలో ఆమె నటించిన తీరు అంతుకు ముందు క్రాక్ సినిమా లో ఆమె నటనకు ఫిదా అయిన దర్శకుడు కొరటాల శివ ఈ నిర్ణయం తీసుకున్నాడనే వార్తలు వస్తున్నాయి.
వరలక్ష్మి శరత్ కుమార్ ఈ సినిమాలో ఉంటే ఖచ్చితంగా సినిమా స్థాయి మరో లెవల్ లో ఉంటుందనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.