ఐశ్వర్య రాజేష్ కి కోలీవుడ్ లో అరుదైన గౌరవం

తెలుగుమ్మాయి ఐశ్వర్య రాజేష్ కోలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.కెరియర్ ప్రారంభం చేసినప్పటి నుంచి ఓ వైపు హీరోయిన్ గా మరో వైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది.

 Aishwarya Rajesh Got Kalaimamani Award, Tollywood, Kollywood, South Cinema, Shiv-TeluguStop.com

అక్కడ స్టార్ హీరోలతో సైతం ఈ అమ్మడు జత కట్టింది.ఇప్పటికి కోలీవుడ్ లో ప్రతి ఏడాది మూడు సినిమాలకి తక్కువ కాకుండా ఐశ్వర్య రాజేష్ చేస్తుంది.

ఇప్పుడిప్పుడే తెలుగులో కూడా ఈ భామకి అవకాశాలు వస్తున్నాయి.అయితే తెలుగమ్మాయి అయినా కూడా తమిళ ప్రజలు ఐశ్వర్య రాజేష్ ని తమ అమ్మాయిగానే చూస్తున్నారు.

అందుకే ఆమెకి కోలీవుడ్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.టాలీవుడ్ మాదిరిగానే కోలీవుడ్ లో హీరోయిన్స్ ఎవరూ కూడా కమర్షియల్ హంగులతో కనిపించరు.

చాలా సింపుల్ గా ఉంటారు.ఈ నేపధ్యంలో కోలీవుడ్ లో ఐశ్వర్య రాజేష్ అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకుంది.

తమిళనాడు ప్రభుత్వం ప్రతి ఏడాది జయలలిత పేరు మీదుగా కలైమామణి అవార్డులని ప్రధానం చేస్తుంది.సినిమాలలో మంచి ప్రతిభ చూపించిన నటీనటులకి ఈ కలైమామణి అవార్డు అందిస్తూ సత్కరిస్తుంది.

ఇప్పుడు ఐశ్వర్య రాజేష్ 2020 నాటికి కోలీవుడ్ లో హీరోయిన్ గా కలైమామణి అవార్డుకి ఎంపిక అయ్యింది.కోలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా, బెస్ట్ పెర్ఫర్మర్ గా అందరి ప్రశంసలు అందుకోవడంతో ఈ అవార్డుకి ఆమె ఎంపికైంది.

ఇక శివ కార్తికేయన్ కూడా ఈ ఏడాది హీరోగా కలైమామణి అవార్డుని అందుకునే జాబితాలో చేరాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube