ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రమక్రమంగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి.చాపకింద నీరులా ఇక్కడ కోవిడ్ వ్యాపిస్తుంది.
ఈ క్రమంలో ఏపీ వైద్య ఆరోగ్యశాఖ గడిచిన 24 గంటల్లో కొత్తగా నమోదైన కరోనా కేసుల వివరాలను వెల్లడించింది.అవెలా ఉన్నాయో తెలుసుకుంటే.
రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 26,436 కరోనా పరీక్షలు నిర్వహించగా 54 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయిందని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.
కాగా అత్యధికంగా చిత్తూరు జిల్లాలో కరోనా కేసులు నమోదు అయ్యాయట.
ఒక్క రోజులోనే ఈ జిల్లాలో 19 మంది కరోనా బారినపడ్డట్లు వెల్లడించింది.ఇక తూర్పు గోదావరి జిల్లాలో 6, కర్నూలు జిల్లాలో 6 కోవిడ్ కేసులు గుర్తించారట.
శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని అధికారులు తెలియచేస్తున్నారు.
ఇకపోతే 70 మంది కొవిడ్ ప్రభావం నుంచి కోలుకోగా, ప్రస్తుతం ఎలాంటి మరణాలు సంభవించలేదని వెల్లడించారు అధికారులు.
కాగా ఇప్పటి వరకు ఏపీలో 8,89,210 పాజిటివ్ కేసులు నమోదు అవగా, 8,81,439 మంది కరోనా నుంచి విముక్తులయ్యారట.ఇంకా 604 మంది చికిత్స పొందుతుండగా, మొత్తం కరోనా మృతుల సంఖ్య 7,167 గా నమోదైందని ఏపీ ఆరోగ్యశాఖ వెల్లడించింది.