టాలీవుడ్ గ్లామర్ బ్యూటీ నటి అనూ ఇమాన్యుల్ గురించి అందరికీ తెలిసిందే.సినీ పరిశ్రమలో అతి తక్కువ సమయంలో వరుస ఆఫర్లతో బాగా గుర్తింపు పొందింది.
ఈ భామ సోషల్ మీడియాలో కూడా నేటి జనులతో బాగా ముచ్చటేస్తుంది.ఇదిలా ఉంటే అను ఇమాన్యుల్ ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ తో ప్రేమాయణం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
2011లో స్వప్న సంచారి అనే మలయాళం సినిమా లో బాలనటిగా పరిచయం అయ్యి.ఆ తర్వాత యక్షన్ హీరో బిజు అనే సినిమా లో హీరోయిన్ గా తెరకెక్కింది.
ఇక 2016 మజ్ను సినిమా తో తెలుగులో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఆ తరువాత వరుస సినిమాలలో నటించిన అను.ఈమధ్య ఓ వార్త తో బాగా వైరల్ గా మారింది.ఆమె ప్రముఖ తమిళ డైరెక్టర్ ఏఎం జ్యోతి కృష్ణ తో ప్రేమలో ఉన్నదన్న వార్తలు వినిపిస్తున్నాయి.
2017 లో ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం కుమారుడు జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన తెలుగు సినిమా ఆక్సిజన్.ఈ సినిమాలో అను ఇమాన్యుల్ హీరోయిన్ గా నటించింది.దీంతో ఆ సమయంలో వారిద్దరి మధ్య స్నేహం మొదలయింది.స్నేహం కాస్త ప్రేమగా మారిందని తెలుస్తుంది.కాక ఈ విషయం గురించి ఎన్నో వార్తలు బయటకు రాగా ఇప్పటివరకు అను గాని, దర్శకుడు జ్యోతి కృష్ణ గాని స్పందించలేదు.దీనినిబట్టి వీరిమధ్య నిజంగానే ప్రేమ ఉందని వార్తలు బాగా వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే అను అల్లుడు అదుర్స్ సినిమా తర్వాత ప్రస్తుతం అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కనున్న మహాసముద్రం సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.