టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ గా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాగా బిజీ గా మారాడు.ఈయన నటన తో ఎంతోమంది అభిమానులను పెంచుకున్నాడు.
టాలీవుడ్ సినిమాలలో ప్రభాస్ బాలీవుడ్ నటుల స్థాయి వరకు చేరుకున్నాడు.ప్రస్తుతం ప్రభాస్ సినీ ఇండస్ట్రీలో ఓ రేంజ్ లో దూసుకుపోతున్నాడు.
ప్రభాస్ కు బాహుబలి తర్వాత ఓ రేంజ్ అనేది వచ్చింది.ఈ సినిమాతోనే సినీ పరిశ్రమలో నే కాకుండా ఎంతోమంది అభిమానుల లో మంచి ఫాలోయింగ్ పెంచుకున్నాడు.
అంతే కాకుండా బాలీవుడ్ బ్యూటీ లను కూడా తన సరసన నటించే లాగా చేసుకున్నాడు.ఇదిలా ఉంటే ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘రాధేశ్యామ్‘ సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.
ఇదిలా ఉంటే ప్రభాస్ ఈ సినిమా లో అదిరిపోయే లుక్ లో కనిపించనున్నాడట.ఆయన వేసే కాస్ట్యూమ్స్ ధర దాదాపు రూ.6 కోట్లు ఖర్చు చేశారని తేలింది.ప్రభాస్ ఇప్పటి వరకు నటించిన అన్ని సినిమాలలో.ఈ సినిమాకు వాడే కాస్ట్యూమ్స్ ధర ఎక్కువట.అంతేకాకుండా ప్రత్యేకంగా ఓ డిజైనర్ టీమ్ నే ఏర్పాటు చేశారట.
యూరప్ నేపథ్యంలో వింటేజ్ పీరియాడికల్ కథకు తగ్గట్టుగా ఈ సినిమాలో ప్రభాస్ లుక్ ను జాగ్రత్తగా డిజైన్ చేస్తున్నారట.
ఇక ప్రభాస్ విక్రమాదిత్య అనే పాత్రలో కనిపించగా, పూజా హెగ్డే ప్రేరణ అనే మ్యూజిక్ టీచర్ పాత్రలో కనిపించనుందని తెలుస్తుంది.ఇక ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషలలో జూలై 30న విడుదల కానుందని సినీ బృందం తెలిపారు.
అంతేకాకుండా ప్రభాస్ ఈ సినిమా తర్వాత మరిన్ని సినిమాలకు ఓకే చెప్పినట్లు వార్తలు కూడా వచ్చాయి.