యాంకర్ అనసూయ ప్రస్తుతం ఓ రేంజ్ లో దూసుకుపోతుంది.ప్రతిరోజు ఏదో ఒక విషయం తో సోషల్ మీడియాలో వార్త గా నిలుస్తుంది.
తన అందంతో ఈ బ్యూటీ టాలీవుడ్ హీరోయిన్ లనే కాకుండా బాలీవుడ్ హీరోయిన్ ల వరకు పొట్టి పొట్టి బట్టలతో ఎంతో గ్లామర్ తో ముందుంటుంది.అంతేకాకుండా ఈ గ్లామర్ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ యువతను కన్నార్పకుండా చేస్తుంది.
ప్రస్తుతం అనసూయ రేంజ్ పట్టాలెక్కుతున్నాయి.బుల్లితెర లో కాకుండా వెండితెర పై కూడా మెరుస్తుంది ఈ భామ.సినిమాలలో వరుస ఆఫర్లతో బాగా ముందుకు పోతుంది.ఇక బుల్లితెరలో ఈటీవీ జబర్దస్త్ షో లో యాంకరింగ్ గా చేస్తూనే వెండితెరపై అడుగులు పెడుతూ బాగా బిజీ గా మారింది.
రంగమ్మత్త గా నటించిన రంగస్థలం సినిమా లో అనసూయ పాత్ర బాగా క్రేజ్ అందించడంతో ఇప్పుడు అందనంత ఎత్తుకు వెళ్తుంది.
ఇదిలా ఉంటే అనసూయ ఓ సినిమాలో నటించనుండగా అందులో అనసూయ పాత్ర వేశ్య పాత్రలో కనిపించనుందట.ఇక ఈ సినిమాలో హీరో గోపీచంద్ నటించనున్నాడు.అంతేకాకుండా ఈ సినిమాలో రాశి ఖన్నా, ఈషా రెబ్బ హీరోయిన్ లుగా నటించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో తెరకెక్కనున్న ఈ సినిమా యువి క్రియేషన్స్, జీఏ2 పిక్చర్ లో నిర్మిస్తున్నారు.ఇక ఈ సినిమాకు పక్కా కమర్షియల్అనే టైటిల్ ను ప్రకటించగా ఈ సినిమా అక్టోబర్ 1న విడుదల చేయడానికి సినీ బృందం సిద్ధంగా ఉందని తెలిపారు.
అనసూయ ఏ పాత్రకైనా ముందుంటుందని అర్థం కాగా ఈ పాత్రతో ఈ సినిమాలో ఎంత వరకు మెప్పిస్తుందో చూడాల్సిందే.