ఆ నియోజకవర్గంలో టిడిపి పార్టీలో చేరిన వైసీపీ మద్దతుదారులు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ అదేవిధంగా మున్సిపల్ ఎన్నికల హడావిడి భారీ స్థాయిలో ఉన్న సంగతి తెలిసిందే.మొదటి విడత రెండో విడత పంచాయతీ ఎన్నికలలో అధికారంలో ఉన్న వైసీపీ భారీ స్థాయిలో మెజారిటీ స్థానాలు దక్కించుకున్నట్లు వచ్చిన ఫలితాలు బట్టి అర్థమవుతుంది.

దీంతో రాష్ట్రవ్యాప్తంగా చాలాచోట్ల వైసీపీ హవా కొనసాగుతూ ఉంటే బాలకృష్ణ నియోజకవర్గంలో మాత్రం సీన్ రివర్స్.  ఆయన ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలో.

వైసీపీ కి మద్దతుగా ఉన్న 100 కుటుంబాలు తాజాగా టిడిపిలో అది కూడా బాలకృష్ణ సమక్షంలో చేరడం జరిగింది.

Telugu Balakrishna, Panchayathi, Ysrcp-Telugu Political News

పంచాయతీ అదేవిధంగా మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గంలో పర్యటించడానికి రంగంలోకి దిగిన బాలయ్యబాబు.టిడిపి పార్టీ కార్యకర్తల లో నాయకులలో జోష్ నింపడానికి రకరకాల కార్యక్రమాలు చేపట్టారు.ఈ సందర్భంగా ఎన్నికలలో ఏ విధంగా ముందుకు వెళ్లాలి అన్నదానిపై కార్యకర్తలతో చర్చలు జరిపారు.

ఇలాంటి తరుణంలో వైసిపికి మద్దతిస్తున్న 100 కుటుంబాలు.బాలకృష్ణ సమక్షంలో టీడీపీలో జాయిన్ అవ్వడం జరిగింది.

ఈ పరిణామం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. 

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube