ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ అదేవిధంగా మున్సిపల్ ఎన్నికల హడావిడి భారీ స్థాయిలో ఉన్న సంగతి తెలిసిందే.మొదటి విడత రెండో విడత పంచాయతీ ఎన్నికలలో అధికారంలో ఉన్న వైసీపీ భారీ స్థాయిలో మెజారిటీ స్థానాలు దక్కించుకున్నట్లు వచ్చిన ఫలితాలు బట్టి అర్థమవుతుంది.
దీంతో రాష్ట్రవ్యాప్తంగా చాలాచోట్ల వైసీపీ హవా కొనసాగుతూ ఉంటే బాలకృష్ణ నియోజకవర్గంలో మాత్రం సీన్ రివర్స్. ఆయన ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలో.
వైసీపీ కి మద్దతుగా ఉన్న 100 కుటుంబాలు తాజాగా టిడిపిలో అది కూడా బాలకృష్ణ సమక్షంలో చేరడం జరిగింది.
పంచాయతీ అదేవిధంగా మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గంలో పర్యటించడానికి రంగంలోకి దిగిన బాలయ్యబాబు.టిడిపి పార్టీ కార్యకర్తల లో నాయకులలో జోష్ నింపడానికి రకరకాల కార్యక్రమాలు చేపట్టారు.ఈ సందర్భంగా ఎన్నికలలో ఏ విధంగా ముందుకు వెళ్లాలి అన్నదానిపై కార్యకర్తలతో చర్చలు జరిపారు.
ఇలాంటి తరుణంలో వైసిపికి మద్దతిస్తున్న 100 కుటుంబాలు.బాలకృష్ణ సమక్షంలో టీడీపీలో జాయిన్ అవ్వడం జరిగింది.
ఈ పరిణామం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది.
.