బాలీవుడ్ లో ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా వరుస అవకాశాలతో దూసుకుపోతున్న ముద్దుగుమ్మ కియరా అద్వానీ.ఈ అమ్మడు ధోనీ బయోపిక్ తో వెలుగులోకి వచ్చి లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్ తో గుర్తింపు తెచ్చుకుంది.
తరువాత తెలుగులో ఏకంగా మొదటి సినిమానే సూపర్ స్టార్ మహేష్ బాబుకి జోడీగా భరత్ అనే నేను సినిమాలో నటించే అవకాశం సొంతం చేసుకుంది.ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో టాలీవుడ్ లో అమ్మడు స్టార్ హీరోయిన్ అయిపోవడం పక్కా అని అందరూ భావించారు.
అయితే కియరా మాత్రం తన ఫోకస్ అంతా బాలీవుడ్ మీదనే పెట్టింది.అక్కడ అర్జున్ రెడ్డి రీమేక్ తో ఒక్కసారిగా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుంది.
దీంతో ఒక్కసారిగా కియరాకి అవకాశాలు వచ్చి పడ్డాయి.సీనియర్ హీరోలకి, కుర్ర హీరోలకి సరిపోయే ఫిగర్ ఉండటంతో బాలీవుడ్ దర్శక నిర్మాతలు కియరాకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.
తెలుగులో భరత్ తర్వాత బోయపాటి దర్శకత్వంలో రామ్ చరణ్ కి జోడీగా వినయ విదేయ రామా సినిమాలో చేసిన అందులో ఆమె పాత్ర కేవలం పాటలకే పరిమితం అయ్యింది.దానికితోడు సినిమా కూడా డిజాస్టర్ అయ్యింది.
తరువాత కొన్ని తెలుగు సినిమాలలో నటించే అవకాశం వచ్చిన కూడా కియరా డేట్స్ అడ్జస్ట్ చేయలేక వదులుకుంది.ఇదిలా ఉంటే తాజాగా ఈ అమ్మడు ఓ ఇంటర్వ్యూలో సౌత్, హిందీ సినిమాల గురించి ఆసక్తికర విషయాలు చెప్పింది.
బాలీవుడ్ లో ఆఫర్స్ వస్తున్నాయని సౌత్ సినిమాలు వదులుకోవడం జరగదని, అక్కడ దర్శక, నిర్మాతలతో తాను కాంటాక్ట్ లోనే ఉన్నానని టైం చూసుకొని సౌత్ అభిమానులని పలకరిస్తానని కియరా అద్వానీ చెప్పుకొచ్చింది.
.