యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఇప్పటికే షూటింగ్ ముగించేసుకుని రిలీజ్కు రెడీ అయ్యింది.ఈ సినిమాను దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ సినిమాను పూర్తి పూరియాడికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా చిత్ర యూనిట్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లో కూడా అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి.
కాగా ఈ సినిమా రిలీజ్ కాకముందే ప్రభాస్ తన నెక్ట్స్ చిత్రాలను వరుసబెట్టి క్యూలో పెడుతున్నాడు.
ఈ క్రమంలోనే కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలో ప్రభాస్ నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను అనౌన్స్ చేసినంత వేగంగా షూటింగ్ కూడా మొదలుపెట్టాడు ప్రభాస్.
ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ను గోదావరిఖనిలో తొలి షెడ్యూల్ జరుపుకున్న చిత్ర యూనిట్, తాజాగా ఈ షెడ్యూల్ను ముగించేసుకుంది కూడా.దీంతో ఈ సినిమా రెండో షెడ్యూల్ను అతి త్వరలో ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాలో ప్రభాస్ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడం ఖాయమని చిత్ర యూనిట్ అంటోండగా, ఈ సినిమాలో అందాల భామ శృతి హాసన్ కూడా అదిరిపోయే రేంజ్లో పర్ఫార్మెన్స్ ఇస్తున్నట్లు తెలుస్తోంది.ఇక ఈ సినిమాలో భారీ తారాగణం ఉండనుండటంతో ఈ సినిమాలో ఎవరెవరు నటిస్తారా అనే అంశం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది.
ఇక ఈ సినిమాను అతి త్వరలో పూర్తి చేసుకుని రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.మరి సలార్ చిత్ర నెక్ట్స్ షెడ్యూల్ను ఎప్పుడు ప్రారంభిస్తారా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.