జగన్ తో గొడవల వార్తలపై ఊహించని కామెంట్ చేసిన షర్మిల..!!

తెలుగు రాజకీయాలలో ఒకపక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరుగుతుండగానే మీడియా ఫోకస్ మొత్తం షర్మిల కొత్త పార్టీ పైన పడింది.ఎప్పటి నుండో షర్మిల కొత్త పార్టీ పై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తుండగా తాజాగా షర్మిల ఎంట్రీ ఇచ్చి కచ్చితంగా తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు స్పష్టం చేయడం జరిగింది.

 Ys Jagan, Ys Sharmilla, Ysr, Telangana, Sharmila Comments On Clashes With Ys Jag-TeluguStop.com

వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉన్న సమయంలో రైతులు అదేవిధంగా పేద విద్యార్థులు మరియు పేదలకు ఇల్లు సకాలంలో అందేవని, ప్రస్తుతం అటువంటి పరిస్థితి తెలంగాణలో లేదని అందుకోసం తాను పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నట్లు పాదయాత్ర కూడా చేసే అవకాశం ఉన్నట్లు స్పష్టం చేయడం జరిగింది.ఇందుకోసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వైయస్ మద్దతుదారులతో జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించి, వారి సూచనల మేరకు నిర్ణయం తీసుకోబోతున్నట్లు షర్మిల చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉంటే అన్న వైయస్ జగన్ తో గొడవలు అనే వార్తలు వస్తున్న వాటిపై మీడియా ప్రశ్నించగా వాటిలో ఎలాంటి వాస్తవం లేదని అన్నారు.ఆయన ఆంధ్రా లో తన పని తాను చేసుకుంటున్నారు.

తాను తెలంగాణ కోసం కమిట్ మెంట్ గా పనిచేయటానికి రెడీ అవుతున్నట్లు ఊహించని రియాక్షన్ కామెంట్ షర్మిల చేశారు.దీంతో షర్మిల చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube