ప్రభాస్ సలార్ మూవీ షూటింగ్ ఇటీవలే ప్రారంభం అయిన విషయం తెల్సిందే.కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.
అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ప్రశాంత్ నీల్ చేస్తున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్ సింగరేణి బొగ్గు గనిలో జరిగింది.మొదటి షెడ్యూల్ సందర్బంగా హడావుడి నెలకొంది.
కేజీఎఫ్ 2 విడుదల కాకుండానే సలార్ సినిమా ను ప్రారంభించి అందరిని ఆశ్చర్యపర్చిన దర్శకుడు ప్రశాంత్ నీల్ అప్పుడే మరో షెడ్యూల్ ను కూడా పూర్తి చేసి అందరికి షాక్ ఇచ్చాడు.ఈ సినిమా చిత్రీకరణ మొదటి నుండి భారీ ఎత్తున చేస్తున్న కారణంగా సినిమా ఓ రేంజ్ లో ఉంటుందని ముందే యూనిట్ సభ్యులు హింట్ ఇస్తున్నారు.
సలార్ మూవీ విషయంలో దర్శకుడు ప్రశాంత్ నీల్ పక్కా ప్రణాళికతో ఉన్నాడు.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం సలార్ సినిమాను అక్టోబర్ వరకు షూటింగ్ పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్నారు.సంక్రాంతి కానుకగా సలార్ ను విడుదల చేయడం కోసం అప్పుడే మొదటి అప్ డేట్ ను ప్రశాంత్ నీల్ అభిమానులకు ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.రికార్డు బ్రేకింగ్ వసూళ్లు నమోదు చేయనున్న కేజీఎఫ్ 2 సినిమాకు సలార్ కు ఎక్కువ సమయం లేకుండానే ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా యూనిట్ సభ్యులు చెబుతున్నారు.
అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా ఈ సినిమా ఉంటుందని చెబుతూనే భారీ యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని, యాక్షన్ సినిమాలు ఇష్టపడే వారికి ఈ సినిమా ఖచ్చితంగా ఓ రేంజ్ లో నచ్చుతుందని అంటున్నారు.ఇక మొదట ఈ సినిమా రుద్ర సినిమాకు రీమేక్ అంటూ వార్తలు వచ్చాయి.
కాని దర్శకుడు ప్రశాంత్ నీలు పలు సార్లు రీమేక్ కానే కాదు అంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు.