సాధారణంగా బర్త్ డే వేడుకలు అందరూ జరుపుకుంటూ ఉండడం సర్వసాధారణం.కానీ తాజాగా ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే బర్త్ డే వేడుకల కోసం ఏకంగా ఆ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసిన సంఘటన అందరిలో చర్చనీయాంశంగా మారింది.
ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.చత్తీస్గడ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే శకుంతల సాహూ పుట్టిన రోజు వేడుకలను అధికారికంగా చేర్పించాలి అంటూ ప్రభుత్వ అధికారులు ఉత్తర్వులను జారీ చేశారు.
అంతేకాకుండా పుట్టినరోజు వేడుకలలో భాగంగా షామియానా లాంటివి ఏర్పాట్లు చేయాలని ఆమె పుట్టినరోజు వేడుకలలో భాగంగా 500 మంది హాజరవుతారని అందుకు తగ్గట్టు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ప్రభుత్వ అధికారులు చూసుకోవాలని జీవో లో తెలపడం చర్చనీయాంశంగా మారింది.ఈ జీవో కాపీ సోషల్ మీడియాలో లీక్ అవడంతో కొంత మంది నెటిజన్స్ మండిపడుతున్నారు.
ప్రభుత్వ వ్యవస్థలను ఇలా వ్యక్తిగత పార్టీలు కోసం ఇలా చేయడం సరికాదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కొందరు.ఈ సంఘటనపై పళరి సీఈఓ మాట్లాడుతూ.ఆ కార్యక్రమం రద్దయినట్లు పేర్కొన్నారు.మరోవైపు బీజేపీ నేత సంజయ్ శ్రీవాత్సవ మాట్లాడుతూ.కాంగ్రెస్ ప్రభుత్వం, పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు గవర్నమెంట్ మిషనరీని దుర్వినియోగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేయడంతోపాటు తమ రాజకీయ అవసరాల కోసం ఇలా ప్రభుత్వాన్నే వాడుకుంటున్నారని విమర్శల వర్షం కురిపించారు.ప్రస్తుతం ఛత్తీస్గడ్ లో శకుంతల సాహో పుట్టినరోజు వేడుకలు జీవో హాట్టాపిక్ గా వైరల్ గా చక్కర్లు కొడుతోంది.