మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్, కృతి హీరోగా నటిస్తున్న చిత్రం ఉప్పెన అనే విషయం అని మనకు తెలిసిందే.కరోనా కంటే ముందు ప్రారంభమై కరోనా కారణంగా ఆలస్యమై ప్రస్తుతం సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకొని “ఉప్పెన” చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.
అంతేకాక ఇందులో విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటిస్తుండడంతో ఈ సినిమాపై అంచనాలు విపరీతంగా పెరిగాయి.విజయ్ సేతుపతి కూడా నటిస్తుండడంతో తమిళనాడులో కూడా భారీ అంచనాల మధ్య సినిమా విడుదల కానుంది.
అయితే ఉప్పెన సినిమా… జనాలలో మంచి టాక్ తెచ్చుకుందంటే కారణం మంచి సంగీతం అని చెప్పాలి.ఈ ఉప్పెన సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు.
త్వరలో సినిమా విడుదలవుతున్న సందర్బంలో తాజాగా ప్రి రిలీజ్ ఫంక్షన్ ను ఏర్పాటు చేయడం జరిగింది.ఈ ప్రి రిలీజ్ ఫంక్షన్ లో హీరో వైష్ణవ్ తేజ్ మాట్లాడుతూ… ఈ సినిమాకి హీరో దేవిప్రసాద్ అని, తన మ్యూజిక్ తో జనాలలో ఎక్కువ రోజులు ఈ సినిమాపై అంచనాలను కొనసాగించడంలో సక్సెస్ అయినందున క్రెడిట్ దేవి శ్రీ ప్రసాద్ అని వైష్ణవ్ తేజ్ అన్నారు.
మ్యూజిక్ తో ఆకట్టుకున్న దేవి శ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాల్సి ఉంది.