ఏపీలో కరోనా కేసులకు సంబంధించి లేటెస్ట్ న్యూస్..!! 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా చాలావరకు కంట్రోల్ లోనే ఉందని చెప్పవచ్చు.దీనికి అనుగుణంగానే రోజురోజుకీ కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య తగ్గుతూ వస్తుంది.

 Ap Corona Health Bulletin, Corona Positive Cases, Ap Department Of Medical Healt-TeluguStop.com

ఈ నేపథ్యంలో తాజాగా ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన లేటెస్ట్ బులెటిన్ ప్రకారం గడచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 34,864 కరోనా పరీక్షలు నిర్వహించగా అందులో 75 మాత్రమే పాజిటివ్ కేసులు బయటపడినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

ఇదిలా ఉంటే ఒకరు మృతి చెందినట్లు ఇదే సమయంలో 133 మంది కరోనా బాధితులు కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది.ఇక ఓవరాల్ గా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 8,88,350 కి చేరగా.7,159 మంది మృతిచెందారు.ప్రస్తుతం 1,012 కరోనా యాక్టివ్ కేసులు ఉండగా.ఇప్పటివరకు కరోనా బారినపడి 8,80,179 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు.అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1,33,11,542 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ తాజా పరిణామాలను బట్టి బులిటెన్ లో పేర్కొంది.  

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube